ETV Bharat / bharat

PG స్టూడెంట్​ 'టీ'​ దందా.. బిర్యానీ టచ్​తో వెరైటీ ఛాయ్​.. యూత్​ ఫిదా

author img

By

Published : Dec 1, 2022, 5:59 PM IST

mukherjee-nagar-jj-thadi-tea-stall-jyoti-is-becoming-self-sufficient-along-with-studies
గులాబీ రేకులు, తులసి ఆకులతో ప్రత్యేక టీ తయారు చేసిన జ్యోతి జంగీద్

దిల్లీలో మాస్టర్స్ చదువుతున్న ఓ యువతి వినూత్నంగా ఆలోచించి టీ స్టాల్​ను ప్రారంభించింది. సాధారణ పద్ధతిలో కాకుండా కొత్త విధానంలో ఛాయ్​ తయారు చేస్తోంది. ప్రస్తుతం ముఖర్జీనగర్​ చుట్టుపక్కల ఆమె టీ స్టాల్ పేరు మారుమోగిపోతోంది. అసలు ఆమె ఎవరు? టీ స్పెషల్​ ఏంటి? వంటి వివరాలను తెలుసుకుందాం రండి.

PG స్టూడెంట్​ 'టీ'​ దందా.. బిర్యానీ టచ్​తో వెరైటీ ఛాయ్​.. యూత్​ ఫిదా

ఆమె మాస్టర్స్ చదువుతోంది. అందరిలా చదువు, తరువాత జాబ్.. ఇలా​ కాకుండా కొంచెం డిఫరెంట్​గా ఆలోచించింది. చదువును కొనసాగిస్తూ.. ప్రజలతో సాన్నిహిత్యంగా మెలిగే ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంది. బాగా ఆలోచించి ఓ టీ స్టాల్​ను ప్రారంభించింది. అందరూ తయారుచేసే టీ లా కాకుండా.. కొత్త విధానంలో ఛాయ్​ తయారు చేస్తూ యువతను బాగా ఆకట్టుకుంటోంది.

mukherjee-nagar-jj-thadi-tea-stall-jyoti-is-becoming-self-sufficient-along-with-studies
జేజే తాడి టీ స్టాల్

గత కొద్దికాలంగా దిల్లీలో ముఖర్జీనగర్​లో ఉన్న జేజే తాడి టీ స్టాల్ యువతతో కళకళలాడుతోంది. దీనికి కారణం ఇక్కడ డిఫరెంట్​గా తయారుచేసిన టీ ఉండడం. ఛాయ్​ తయారీలో ఎవరైనా పాలు, నీరు, టీ పొడి, చక్కెర, యాలకులు వినియోగిస్తారు. కానీ జేజే తాడి టీ స్టాల్‌లో మాత్రం గులాబీ రేకులు, బిర్యానీ ఆకులు, తులసి ఆకులను వాడుతున్నారు. వీటితో తయారు చేసిన టీ రుచిగా ఉండటం వల్ల ఛాయ్​ తాగడానికి ప్రజలు తరలివస్తున్నారు.

mukherjee-nagar-jj-thadi-tea-stall-jyoti-is-becoming-self-sufficient-along-with-studies
గులాబీ రేకులు, తులసి ఆకులతో ప్రత్యేక టీ

రాజస్థాన్​కు చెందిన జ్యోతి జంగీద్​ మాస్టర్స్​ చదివేందుకు దిల్లీ వచ్చింది. అక్క వాళ్లతో కలిసి ముఖర్జీనగర్​లో ఉంటోంది. గ్రాడ్యుయేషన్​ను అక్కడే ఉండి పూర్తి చేసింది. ఆ తర్వాత ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంది. బాగా ఆలోచించి టీ స్టాల్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ముఖర్జీనగర్​లో 'జేజే తాడి' పేరుతో టీ స్టాల్ ప్రారంభించింది. టీ స్టాల్​ పేరులో జేజే అంటే జ్యోతి జంగీద్​ అని, తాడి అంటే తమ భాషలో కూర్చునే చోటని ఆమె చెబుతోంది.

" నా షాప్​లో తయారుచేస్తున్న టీ లో సహజసిద్ధ పదార్ధాలను ఉపయోగిస్తున్నాను. రోజూ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి టీ తాగుతున్నారు. కొందరు 5 సార్లు నేను తయారుచేసిన టీ తాగుతున్నారు. కెమికల్స్​ ఉన్న పదార్ధాలు టీ తయారీలో వాడట్లేదు కనుక రోజుకు ఎన్నిసార్లు తాగినా ఆరోగ్యానికి హాని కలుగదు."

-- జ్యోతి జంగీద్, మాస్టర్స్​ విద్యార్థిని

తన టీ దుకాణానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు జ్యోతి చెబుతోంది. అందుకు తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
అయితే ఇంతకుముందు ప్రియాంక అనే యువతి కూడా బిహార్​ రాజధాని పట్నాలో టీ స్టాల్ ప్రారంభించింది. ఆమె తన సొంత ఊరిని, కన్నవారిని వదిలేసి ఒంటరిగా రాజధాని వచ్చింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.