ETV Bharat / bharat

'రావత్​ హెలికాప్టర్ క్రాష్'.. వీడియో తీసిన వ్యక్తి ఫోన్ స్వాధీనం!

author img

By

Published : Dec 12, 2021, 8:21 PM IST

bipin rawat
బిపిన్‌ రావత్‌

Army helicopter crash: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా.. 13 మంది మృతి చెందిన ఘటనలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను వీడియో తీసిన వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో భాగంగా కోయంబత్తూరులోని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.

Army helicopter crash: త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్ బిపిన్ రావత్​ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను పరిశోధించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​​ కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు కోయంబత్తూరుకు చెందిన వై.జో అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ తీసిన వీడియోపై ఆరా తీస్తున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా జో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కోయంబత్తూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ వ్యక్తి తన స్నేహితులతో కలిసి కట్టేరి ప్రాంతంలో ఫొటోలు దిగేందుకు వెళ్లాడని గుర్తించారు. అయితే.. అటవీ జంతువుల సంచారం అధికంగా ఉండే ఈ జోన్​ నిషేధిత ప్రాంతం. అయినప్పటికీ వీరంతా అక్కడికి ఎందుకు వెళ్లారనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.

మరోవైపు.. ఘటన జరిగిన రోజు ఈ ప్రాంతంలోని వాతావరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెన్నైలోని వాతావరణ శాఖను కోరింది పోలీసు శాఖ. ప్రమాదానికి గల కారణాలు సేకరించేందుకు ప్రత్యక్ష సాక్షులను సైతం ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.