ETV Bharat / bharat

గుజరాత్​లో మోదీ మూడు రోజుల పర్యటన.. డబ్లూహెచ్​ఓ కేంద్రం గర్వకారణమని ట్వీట్​

author img

By

Published : Apr 18, 2022, 6:39 AM IST

Modi On WHO Traditional Medicine
who traditional medicine center

Modi On WHO Traditional Medicine: భారత్​లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ ఔషధ కేంద్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ ఏర్పాటు ప్రతీ భారతీయుడికి గర్వకారణమన్నారు.

Modi On WHO Traditional Medicine: ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ ఔషధ కేంద్రాన్ని భారత్​లో ఏర్పాటు చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్​లో ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రానికి ఏప్రిల్​ 19న శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం సంప్రదాయ ఔషధాన్ని ఉపయోగించే విధంగా కేంద్రం ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ మేరకు గుజరాత్​లో​ తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. అంతర్జాతీయ ఆయుష్​ సమావేశంతో పాటు ఆదివాసీ సమ్మేళనంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.​

ప్రధాని మూడు రోజుల గుజరాత్ పర్యటన సోమవారం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా గాంధీనగర్​, బనాస్​కాంఠా, జామ్​నగర్​, దాహోద్​ జిల్లాలో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరవుతారు. సోమవారం విద్యా సమీక్ష కేంద్రాన్ని సందర్శిస్తారు. విద్యారంగంలో పనిచేసేవారితో ముచ్చటిస్తారు. బనాస్​కాంఠాలో జరిగే కార్యక్రమంలో మంగళవారం పాల్గొంటారు. కొత్త డెయిరీ కాంప్లెక్స్​, బంగాలదుంప ప్రాసెసింగ్ ప్లాంట్​కు శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు స్థానిక రైతులను మరింత శక్తిమంతం చేస్తాయని మోదీ ఆకాంక్షించారు. బుధవారం గ్లోబల్ ఆయుష్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్ ఇన్నోవేషన్​ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం గాంధీనగర్​లోని మహాత్మా మందిర్​లో జరుగుతుంది. అదే రోజు దాహోద్​లో ఆదివాసీ సమ్మేళనంలోనూ మోదీ పాల్గొంటారు.

ఇదీ చదవండి: 'భాజపాతో కాంగ్రెస్ సీనియర్ల కుమ్మక్కు- మీ పార్టీలో ఇక నేనుండను!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.