ETV Bharat / bharat

వేలంలో 'గోల్డ్​ టీ' నయా రికార్డ్​.. కిలో రూ.1.5 లక్షలకు కొన్న హైదరాబాదీ

author img

By

Published : Dec 17, 2022, 9:31 PM IST

అసోంలో మనోహరి గోల్డ్​ టీ వేలంలో మరోసారి రికార్డ్​ ధర పలికింది. హైదరాబాద్​కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కిలో టీ పొడిని రూ.1.5 లక్షలకు కొనుగోలు చేశారు. గతేడాది వేలంలో ఈ గోల్డ్​ టీ ధర రూ.99,999 పలికింది.

Manohari Gold Tea
Manohari Gold Tea

Assam Gold Tea 1KG Price: మన దేశంలో చాయ్​కు ఉన్న క్రేజే వేరు. అందులోనూ అసోం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తి అయిన టీ పొడికి మంచి డిమాండ్​ ఉంటుంది. ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన టీ పొడులను వేలం వేస్తాయి. ఈ క్రమంలో శనివారం.. మనోహరి గోల్డ్​ టీ రికార్డ్​ నమోదు చేసింది. వేలంలో కిలో టీ పొడి రూ. 1.5 లక్షలకు అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.99,999గా ఉంది.

హైదరాబాద్​కు చెందిన నీలోఫర్​ కేఫ్ యజమాని కె.బాబూరావు ఈ గోల్డ్​ టీని రూ.1.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు మనోహరి టీ ఎస్టేట్ యజమాని రాజన్​ లోహియా తెలిపారు. ఈ టీ పొడిని తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో టీ గార్డెన్​లో తీసిన సింగిల్​ బడ్స్​తో తయారుచేస్తామని తెలిపారు. మనోహరి గోల్డ్​ టీ పొడితో తయారు చేసిన టీని ఒక కప్.. రూ.1000కు విక్రయిస్తామని నీలోఫర్​ కేఫ్​ యజమాని బాబూరావు చెప్పారు.

మనోహరి గోల్డ్​ టీ
మనోహరి గోల్డ్​ టీ
అసోంలో మొత్తం 850 టీ గార్డెన్స్​ ఉన్నాయి. ఏటా 650 మిలియన్​ కిలోలకు పైగా టీని ఆ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశంలోని టీ ఉత్పత్తిలో 52 శాతం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.