ETV Bharat / bharat

గర్భిణీని హతమార్చిన భర్త.. ఆపై బంగ్లాకు పారిపోయేందుకు యత్నం

author img

By

Published : Jan 30, 2023, 9:57 AM IST

woman acid attack on husband
భర్తపై యాసిడ్ దాడి

గర్భంతో ఉన్న భార్యను హతమార్చాడు ఓ భర్త. అనంతరం బంగ్లాదేశ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు బంగాల్​లో అరెస్ట్ చేశారు. నిందితుడు బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడని తెలిపారు. మరోవైపు, భర్తపై యాసిడ్ పోసింది ఓ మహిళ. దీంతో అతడి ముఖం కాలిపోయింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. గర్భంతో ఉన్న భార్యను హతమార్చాడు ఓ వ్యక్తి. అనంతరం బంగ్లాదేశ్​కు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడు నాజీర్ హుస్సేన్​(29)ను సుద్దగుంటెపాల్య పోలీసులు బంగాల్​లో అరెస్ట్​ చేశారు. అతడిని బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడిగా గుర్తించారు.

"నిందితుడు బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడు. బంగ్లాదేశ్​లోని ఢాకాలో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ శిక్షణ పొందాడు. అతడికి ల్యాప్‌టాప్​లు, మొబైల్ రిపేర్‌లో నైపుణ్యం ఉంది. నిందితుడు తప్పుడు పత్రాలు సృష్టించి సిలిగుడి మీదుగా కోల్​కతా చేరుకున్నాడు. ఆ తర్వాత ముంబయి, దిల్లీ, గుర్​గ్రామ్​లో మొబైల్ రిపేర్ షాపులను నిర్వహించాడు. 2019లో బెంగళూరు వచ్చి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అతడికి నెలకు రూ.75 వేల జీతం. దిల్లీ అడ్రస్​తో ఆధార్ కార్డు, కోల్​కతా చిరునామాతో పాన్ కార్డు, బెంగళూరు చిరునామాతో ఓటరు గుర్తింపు కార్డు ఉంది. బెంగళూరుకు చెందిన నాజ్​ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆరు నెలలపాటు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితం.. ఒక్కసారిగా మారిపోయింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో జనవరి 16న ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం బంగ్లాదేశ్​కు పారిపోయే ప్రయత్నం చేశాడు."

--పోలీసులు

man killed his pregnant wife
నిందితుడు నాజీర్ హుస్సేన్

భర్తపై యాసిడ్ దాడి..
ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడి అతడి ముఖంపై యాసిడ్​ పోసింది ఓ మహిళ. దీంతో భర్త ముఖం కాలిపోయింది. బాధితుడు తన భార్యపై కలెక్టర్​గంజ్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్పించి.. నిందితురాలు పూనమ్​ను అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కోపర్​గంజ్​కు చెందిన గుప్తా, పూనమ్​ భార్యాభర్తలు. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. దీంతో పూనమ్​ను గుప్తా కొట్టగా.. ఆమె కిందపడిపోయింది. కోపోద్రిక్తురాలైన పూనమ్ బాత్​రూమ్​లో ఉన్న యాసిడ్​ను గుప్తా ముఖంపై పోసింది. దీంతో గుప్తా ముఖం కాలిపోయింది. అనంతరం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా.. పూనమ్​ను అరెస్ట్ చేశారు. పోలీసులు స్థానికులను విచారించగా.. గుప్తా మద్యానికి బానిసయ్యాడని.. అందుకే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.