ETV Bharat / bharat

టిఫిన్ బండి​ దగ్గర మిస్.. కాసేపటికే మరోచోట కాల్పులు.. ఒకరు మృతి

author img

By

Published : Mar 27, 2022, 10:57 AM IST

Man Shot Dead in Idukki
Man Shot Dead in Idukki

Man Shot Dead in Idukki: కేరళలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫుడ్​కార్ట్​ వద్ద ఓ వ్యక్తితో గొడవపడి తొలిసారి కాల్పులు జరిపిన నిందితుడు.. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బయట మరోసారి ఆ వ్యక్తి ఎదురుపడగా.. మళ్లీ కాల్పులు జరిపాడు.

Man Shot Dead in Idukki: కేరళలో కాల్పుల కలకలం రేగింది. ఇడుక్కి జిల్లాలోని మూలమట్టం ప్రాంతంలో ఫిలిప్ మార్టిన్ అనే వ్యక్తి.. కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి 10 గంటలకు అశోక్ జంక్షన్​లోని ఓ ఫుడ్ కార్ట్​కు వెళ్లిన ఫిలిప్.. అక్కడే ఉన్న సనల్ సాబు అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. వెంటనే తన కారులో ఉన్న ఆయుధాన్ని తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.

Kerala crime news: దీంతో వెంటనే అక్కడి నుంచి పరార్ అయ్యాడు మార్టిన్. ఘటాస్థలి నుంచి తన కారులో తోడుపుళ వైపు పారిపోయాడు. అదే సమయంలో ఫుడ్ కార్ట్​లో ఉన్న సనాల్ సాబు, ప్రదీప్ అనే మరో వ్యక్తితో కలిసి బైక్​పై వెళ్లిపోయాడు. కాగా, మార్టిన్, సనాల్ మళ్లీ ఎదురుపడ్డారు. మరోసారి ఘర్షణకు దిగారు. దీంతో మార్టిన్ తన తుపాకీతో మళ్లీ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సనాల్ ప్రాణాలు కోల్పోగా.. ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు.

మృతుడు సనాల్.. కీరితోడె ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు బస్ ఉద్యోగి అని చెప్పారు. ప్రదీప్​ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు. అతడికి తీవ్రగాయాలైనట్లు తెలిపారు. నిందితుడు మార్టిన్​ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అతడి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ ముమ్మరం చేశామని పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం సూపర్.. నెలలో 15సార్లు స్వీట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.