ETV Bharat / bharat

'మహా' విలయం- ఒక్కరోజే 67,468 మందికి కరోనా​

author img

By

Published : Apr 21, 2021, 9:14 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 67,468 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. కరోనాతో మరో 568 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 33,214 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 23,558, కేరళలో 22,414 మందికి కరోనా నిర్ధరణ అయింది.

corona cases
కరోనా కేసులు

దేశంలో కొవిడ్​-19 పంజా విసురుతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 67,468 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 568 మంది మరణించారు. ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా పంజా విసురుతోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 33,214 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 187 మంది మరణించారు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • కర్ణాటకలో కొవిడ్​ కోరలు చాస్తోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 23,558 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 116 మంది బలయ్యారు.
  • కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,414 మంది కరోనా బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 14,622 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. కరోనా బారినపడి మరో 62 మంది వైరస్​తో మరణించారు.
  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 13,107 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో కొత్తగా 75 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • గుజరాత్​లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 12,553 కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 125 మంది వైరస్​తో మరణించారు.
  • తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 11,681 మందికి పాజిటివ్​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బంగాల్​లో కొత్తగా 10,784 మంది వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 58 మంది మరణించారు.
  • ఉత్తరాఖండ్​లో కొత్తగా 4,807 మంది కరోనా బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 34 మరణించారు.

ఇదీ చదవండి : ఆ నాలుగు రాష్ట్రాల్లో.. అందరికీ టీకా ఉచితంగానే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.