ETV Bharat / bharat

'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 67,123 కేసులు

author img

By

Published : Apr 17, 2021, 8:41 PM IST

Updated : Apr 17, 2021, 10:33 PM IST

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కొత్తగా 67,123 మందికి పాజిటివ్​ నిర్ధరణ అయింది. వైరస్​తో 419 మంది మరణించారు. యూపీలోనూ ఒక్కరోజే 27వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో రికార్డు స్థాయిలో 13వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు.

Maharashtra reports 67,123 fresh COVID cases
మహారాష్ట్రలో 67, 123 మందికి పాజిటివ్​

మహారాష్ట్రలో కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. శనివారం కొత్తగా 67,123 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్​ బారినపడి మరో 419 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో యాక్టివ్​ కేసుల సంఖ్య 6,47,933కు చేరింది. మరణాల సంఖ్య 59,970కు చేరువైంది. ఒక్క ముంబయిలోనే కొత్తగా 8,834 కేసులు నమోదవ్వటం.. వైరస్​ తీవ్రతను కళ్లకు కడుతోంది.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 27,357 కరోనా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 120 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశరాజధానిలో కొత్తగా 24,375 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 167 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 17,489 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో 80 మంది మృతిచెందారు.
  • కేరళలో రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 13,835 మంది కరోనా బారినపడ్డారు. వైరస్​తో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మధ్యప్రదేశ్​లో శనివారం కొత్తగా 11,269 కరోనా కేసులు నమోదుకాగా.. వైరస్​ ప్రభావానికి మరో 66 మంది మరణించారు.
  • గుజరాత్​లో కొత్తగా 9,541మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ ధాటికి మరో 97 మంది బలయ్యారు.
  • తమిళనాడులో కొత్తగా 9,344 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 39 మంది మరణించారు.
  • ఉత్తరాఖండ్​లో మరో 2,757 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ ధాటికి మరో 37మంది మరణించారు.
  • గోవాలో కొత్తగా 762 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో నలుగురు మరణించారు.
  • కుంభమేళాలో పాల్గొన్న 175 సాధువులు శనివారం కరోనా బారినపడినట్లు హరిద్వార్ ప్రధాన వైద్యాధికారి డా. ఎస్​కే జా తెలిపారు. ఇప్పటివరకు 229 సాధువులు కొవిడ్​-19 బారిన పడినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళకరం'

Last Updated : Apr 17, 2021, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.