ETV Bharat / bharat

భుజంపై మేనకోడలి మృతదేహం.. గుండెల నిండా దుఃఖం.. అంబులెన్స్​ లేక 5 కి.మీ. అలానే..

author img

By

Published : Jun 12, 2022, 12:28 PM IST

Updated : Jun 12, 2022, 1:31 PM IST

Man Carries Niece Deadbody On Shoulder
Man Carries Niece Deadbody On Shoulder

Man Carries Niece Deadbody On Shoulder: ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఓ వ్యక్తి తన నాలుగేళ్ల మేనకోడలి మృతదేహాన్ని భుజాలపై సుమారు 5 కి.మీ. మేర మోసుకుంటూ ఇంటికి తీసుకువెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

బాలిక మృతదేహాన్ని భుజంపై మోసుకెళ్తున్న దృశ్యాలు

Man Carries Niece Deadbody On Shoulder: ఓవైపు దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని గొప్పలు చెప్పుకుంటున్నా.. మరోవైపు, కొన్ని ఘటనలు మాత్రం మనం ఎంత వెనకబడి ఉన్నామనేది తేటతెల్లం చేస్తున్నాయి. వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చామని చెబుతున్న నాయకులు.. కొన్నిచోట్ల కనీస సదుపాయాలను సైతం కల్పించలేకపోతున్నారు.

ఆసుపత్రిలో అంబులెన్స్​ అందుబాటులో లేక.. తన నాలుగేళ్ల మేనకోడలి మృతదేహాన్ని ఓ వ్యక్తి భుజాలపైనే 5 కిలోమీటర్లు మోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సదరు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. మధ్యప్రదేశ్​లోని ఛతర్‌పుర్‌ జిల్లాలో కొద్దిరోజుల కిందట ఈ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది.

Man Carries Niece Deadbody On Shoulder
శవాన్ని భుజంపై మోసుకెళ్తున్న దృశ్యం

ఛతర్‌పుర్​ జిల్లాలోని పౌడీ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే బుక్స్‌వాహా హెల్త్​సెంటర్‌కు తీసుకెళ్లిన కుటుంబసభ్యులు.. బాలిక ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడం వల్ల దామో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతతో ఆ బాలిక మృతిచెందింది. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం విజ్ఞప్తి చేసినా కనీసం ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఎంత బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమిలేక బాధితురాలి మేనమామ.. మృతదేహాన్ని దుప్పటితో కప్పి బస్సులో బుక్స్‌వాహాకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఏదైనా వాహనం సమకూర్చమని అక్కడ అధికారుల దగ్గర మరోసారి మొరపెట్టుకున్నారు. అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని 5 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడటం వల్ల జిల్లా సీఎంహెచ్‌ఓ స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

ఇవీ చదవండి: డ్రైవర్​ నిర్లక్ష్యం.. చిన్నారి తలమీదుగా దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే!

వేధించిన యువకుడికి మహిళ చెప్పు దెబ్బలు.. అరగంట పాటు!

Last Updated :Jun 12, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.