ETV Bharat / bharat

మద్యం కోసం రైలును ఆపేసిన డ్రైవర్​.. మార్కెట్లో హంగామా!

author img

By

Published : May 3, 2022, 7:54 PM IST

bihar news
bihar news

Driver Stopped Train To Consume Liquor: చాయ్​ కోసం రైలును ఆపిన ఘటన మరవకముందే.. మరో ఘటన జరిగింది. మద్యం తాగడానికి రైలునే నిలిపివేశాడు మరో డ్రైవర్​. ఈ విచిత్ర ఘటన బిహార్​లోని సమస్తిపుర్​ జరిగింది.

Driver Stopped Train To Consume Liquor: బిహార్​లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్న విక్రయాలు ఆగడం లేదు. తాజాగా సమస్తిపుర్​లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించడానికి రైలునే ఆపేశాడు ఓ డ్రైవర్​. సమస్తీపుర్ నుంచి సహర్సాకు ప్రయాణించే ప్యాసింజర్​ రైలును నడుపుతున్న అసిస్టెంట్ లోకో పైలట్​ కర్మవీర్​ ప్రసాద్​... హసన్​పుర్​ స్టేషన్​లో రైలును ఆపి మద్యం తాగడానికి వెళ్లాడు.

.
డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న అధికారులు
.
డ్రైవర్​ను తరలిస్తున్న పోలీసులు

అసిస్టెంట్​ లోకో పైలెట్​ లేకపోవడం వల్ల రైలు ముందుకు కదలలేదు. దీంతో రైలులోని ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైలు సేవలను పునరుద్ధరించారు. రైలు అసిస్టెంట్​ లోకో పైలట్​ కర్మవీర్​ ప్రసాద్​ హసన్​పుర్ మార్కెట్లో మద్యం సేవించి హంగామా సృష్టినట్లు తెలిసింది. వెంటనే జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పోలీస్​స్టేషన్​కు తీసుకువెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం హసన్​పుర్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఇదీ చదవండి: ఒకే ప్రాంగణంలో హారతి, అజాన్​.. వెల్లివిరిసిన మత సామరస్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.