ETV Bharat / bharat

ఒకే ప్రాంగణంలో హారతి, అజాన్​.. వెల్లివిరిసిన మత సామరస్యం

author img

By

Published : May 3, 2022, 5:50 PM IST

Kanpur News: ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​ నగర ప్రజలు హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నారు. ఒకే ప్రాంగణంలో హారతి, అజాన్​లు ఇస్తూ దేశంలోని ఇతర ప్రాంతాల వారికి ప్రత్యేక ఉదాహరణగా నిలిచారు.

kanpur news
kanpur news

Kanpur News: దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​ ప్రజలు ప్రత్యేక ఉదాహరణగా నిలిచారు. హారతి, అజాన్​లు ఒకే ప్రాంగణంలో చేస్తూ హిందూ ముస్లిం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తున్నారు. కాన్పూర్​ నగర నడిబొడ్డున్న ఉన్న తత్మిల్​ చౌక్​ వద్ద హనుమాన్​ దేవాలయం, మసీదు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఇరు వర్గాల సహాకారంతో ప్రార్థనలు జరుగుతాయని ఆలయ పూజారి తెలిపారు.

"రెండు వర్గాల సహకారంతో హారతి, అజాన్​ జరుపుకుంటాము. మేము అందరిని కలుపుకొని పోవడాన్ని నమ్ముతాం. పరమత సహనాన్ని పాటిస్తాం. మేము ఎంతో శాంతిగా ఉంటాం."

- హనుమాన్​ ఆలయ పూజారి

"గుడికి, మసీదుకు రెండింటికీ ఒకటే ప్రవేశం ఉంది. మేము ఆలయాన్ని దాటుకొనే మసీదులోకి వెళ్లాలి. నాలుగు సంవత్సరాలుగా ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడకు వస్తున్నాం. ఇక్కడ ఇరువర్గాల ప్రజలు సోదరభావంతో ఉన్నారు."

- ఒవైసీ, ముస్లిం పూజారి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ హింస, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ రాళ్లదాడి, దిల్లీలోని జహంగీర్‌పురి హింస మొదలైన వాటితో సహా గత రెండు నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో పలు వర్గాల మధ్య ఘర్షణలు నమోదవుతున్నాయి.

ఇదీ చదవండి: సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్- పాక్ సైనికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.