ETV Bharat / bharat

'లఖింపుర్' కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీం చర్యలు

author img

By

Published : Nov 17, 2021, 2:53 PM IST

లఖింపుర్ ఖేరి రైతు నిరసనల్లో చెలరేగిన హింసపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ జైన్‌ను నియమించింది సుప్రీంకోర్టు.

lakhimpur kheri case
లఖింపుర్​ ఖేరీ సుప్రీంకోర్టు

లఖింపూర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను ఓ విశ్రాంత న్యాయమూర్తికి సుప్రీంకోర్టు అప్పగించింది. పంజాబ్‌-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ జైన్‌ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

లఖింపూర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్​ అధికారులను సుప్రీంకోర్టు చేర్చింది. వారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు కానందున దర్యాప్తు బృందంలో నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. సిట్‌ విచారణ పూర్తిచేసి స్థాయీ నివేదిక సమర్పించిన తర్వాత ఈ కేసు విచారణను.. మరోసారి చేపడతామని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది.

లఖింపూర్‌ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి వాహనం నడిపి.. మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్రమంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిశ్‌ మిశ్రను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.