ETV Bharat / bharat

కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి - కొత్తగా 13,984 కేసులు

author img

By

Published : Aug 2, 2021, 10:24 PM IST

corona in states
దేశంలో కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 13,984 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 4,869 కరోనా కేసులు నమోదయ్యాయి.

కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఆరు రోజులుగా 20,000కు పైగా నమోదవ్వగా.. సోమవారం 14వేల లోపునకే పరిమితమయ్యాయి. కొత్తగా ఆ రాష్ట్రంలో 13,984 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 118 మంది వైరస్​ ధాటికి మరణించారు.

మరోవైపు.. మహారాష్ట్రలో కొత్తగా 4,869 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 25 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 20,021కి పెరిగింది.

ఆర్​టీ-పీసీఆర్​ తప్పనిసరి

కరోనా నేపథ్యంలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చేవారు... తప్పనిసరిగా ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష నెగెటివ్​ ధ్రువపత్రాన్ని తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పరీక్ష ఫలితం లేనట్లయితే.. తమ రాష్ట్రం పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పింది. అయితే.. ఆ పరీక్ష ఫలితం వచ్చేవరకు సంస్థాగత క్వారంటైన్​లోనే ఉండాలని స్పష్టం చేసింది.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో కొత్తగా 1,957 మందికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,032 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 97 మంది మరణించారు.
  • గుజరాత్​లో 22 కేసులు నమోదు కాగా.. మధ్యప్రదేశ్​లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • హిమాచల్​ ప్రదేశ్​లో 208 మందికి కరోనా సోకినట్లు తేలింది.

ఇదీ చూడండి: 'డెల్టా' దెబ్బకు ఆసుపత్రులు ఫుల్- మళ్లీ ఆంక్షలు!​

ఇదీ చూడండి: 'మానవ శరీరంలోనే కొత్త వేరియంట్లకు బీజాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.