ETV Bharat / bharat

నలుగురు కలిసి మహిళను వివస్త్రను చేసి, ఫోన్​లో వీడియో తీసి...

author img

By

Published : Sep 13, 2021, 7:18 PM IST

karantaka woman naked and assaulted news
కర్ణాటకలో మహిళపై దారుణం

ఓ మహిళపై కొందరు కిరాతకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెను వివస్త్రను చేసి, లైంగికంగా వేధించారు. ఆ దృశ్యాలను తమ ఫోన్​లో బంధించారు. 8 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలో ఓ అమానవీయ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను వివస్త్రను చేసిన కొందరు కామాంధులు ఆమెను లైంగికంగా వేధించారు. అంతేకాకుండా ఆ దృశ్యాలను తమ ఫోన్​లలో చిత్రీకరించారు.

8 నెలల క్రితం..

కర్ణాటక యాదగిరి జిల్లాలో(Karnataka Yadgir News) ఎనిమిది నెల క్రితం మహిళపై ఈ దారుణం జరిగింది. అయితే.. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వైరల్​గా మారగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే.. మహిళపై వేధింపులకు గల కారణాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.

"ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటన 8 నెలల క్రితం జరిగినట్లుగా తేలింది. కానీ, నిందితులు మాత్రం ఏడాదిన్నర క్రితం జరిగిందని చెబుతున్నారు. దీనిపై షాహన్​పుర్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. మేము ఈ కేసును తీవ్రంగా పరిగణించి, మొత్తం నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకన్నాం."

-వేదమూర్తి, యాదగిరి ఎస్పీ.

ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ఇంకా పోలీసులను ఆశ్రయించలేదని ఎస్పీ వేదమూర్తి తెలిపారు. దర్యాప్తులో భాగంగా.. తమ అధికారులు ఘటనాస్థలికి వెళ్లనున్నారని చెప్పారు.

ఇదీ చూడండి: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సుత్తితో బెదిరించి...

ఇదీ చూడండి: టాయిలెట్​కు వెళ్లిన చిన్నారిని లాక్కెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.