ETV Bharat / bharat

14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సుత్తితో బెదిరించి...

author img

By

Published : Sep 12, 2021, 12:37 PM IST

రైల్వే స్టేషన్​కు వచ్చిన ఓ 14 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. సుత్తితో బెదిరించి, ఓ పాత భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

rape accused arrested
బాలికపై రైల్వే స్టేషన్ సమీపంలో అత్యాచారం

మహారాష్ట్ర ఠాణెలో(Maharashtra Thane) మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. సదరు నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

షిర్డీకి చెందిన బాధిత బాలిక.. ప్రైవేటు బస్సులో కల్యాణ్​లోహ్​​ మార్గ్ ప్రాంతానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. అక్కడి నుంచి తన స్నేహితులను కలిసేందుకు ఉల్హాస్ నగర్​ రైల్వే స్టేషన్​కు లోకల్​ రైలులో వెళ్లింది. అక్కడ తన ఇద్దరు మిత్రులను కలిసింది. ఈ క్రమంలో శ్రీకాంత్​ గైక్వాడ్ అనే వ్యక్తి.. ఆకస్మాత్తుగా వారి ముందుకు సుత్తితో వచ్చాడు. వారిపై దాడి చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిత బాలికను వదిలేసి, ఆమె స్నేహితులు పరారయ్యారు.

rape accused arrested
నిందితుడిని తీసుకువెళ్తున్న పోలీసులు(వృత్తంలో వ్యక్తి)

ఆ తర్వాత బాలికను రైల్వేస్టేషన్​ సమీపంలోని ఓ పాత ఇంట్లోకి తీసుకువెళ్లి, ఆమెపై శ్రీకాంత్ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక(Rape Victim).. రాత్రంతా నిందితుడి వద్దే ఉన్నట్లు చెప్పారు. ఉదయం పూట తన స్నేహితులకు ఫోన్​ చేసి, జరిగిన విషయాన్ని బాలిక తెలియజేసిందని పేర్కొన్నారు. దీనిపై కల్యాణ్ లోహ్​మార్గ్ పోలీస్​ స్టేషన్​ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: 33 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన అత్యాచార బాధితురాలు..

ఇదీ చూడండి: బాలికపై బంధువే అత్యాచారం.. అవమానంతో ఆత్మహత్య

ఇదీ చూడండి: మళ్లీ బతికొస్తాడని గంటలపాటు బురదలోనే మృతదేహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.