ETV Bharat / bharat

'అందరం బంధువులమే.. ఎవరు బతికున్నారో తెలియడం లేదు'

author img

By

Published : Jun 3, 2022, 5:56 PM IST

kalaburagi bus accident
kalaburagi bus accident

kalaburagi bus accident : కర్ణాటక కలబురిగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఓ ప్రయాణికురాలు కీలక విషయాలను వెల్లడించింది. బస్సులో వెనకు కూర్చున్న వారు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని.. మిగతా వారందరూ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.

వెనుక కూర్చున్న వారు బతికిపోయారు.. బస్సు ప్రమాదంపై ప్రయాణికురాలి ఆవేదన!

kalaburagi bus accident : కర్ణాటక కలబురిగి బస్సు ప్రమాదానికి సంబంధించి.. కీలక విషయాలను వెల్లడించింది ప్రయాణికురాలు కల్పన. బస్సులో వెనుక కూర్చున్న వారు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని.. మిగతావారందరూ చనిపోయినట్లు పేర్కొంది. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ' అందరం గోవా టూర్​కు వెళ్లి తిరిగి వస్తున్నాం. ఉదయం అలారం​ వస్తే ఆఫ్​ చేసి పడుకున్నాను. ఇంతలోనే మంటలు వ్యాపించి చాలా మంది చనిపోయారు. బస్సులో ఉన్నవారమంతా బంధువులమే. ఇప్పుడు ఎవరు ప్రాణాలతో ఉన్నారో కూడా తెలియదు.' అని కల్పన కన్నీటి పర్యంతమైంది.

kalaburagi bus accident
చికిత్స పొందుతున్న ప్రయాణికురాలు
kalaburagi bus accident
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

Road Accident Karnataka: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టిన ఘటనలో వీరంతా సజీవదహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డ్రైవర్‌ సహా 35 మందితో కూడిన ప్రైవేటు బస్సు గురువారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఒక కుటుంబానికి చెందిన 11 మంది.. మరో కుటుంబానికి చెందిన 21 మందితో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు. తెల్లవారుజామున కర్ణాటకలోకి ప్రవేశించిన ట్రావెల్స్‌ బస్సు బీదర్‌- శ్రీరంగపట్టణం హైవే గుండా గమ్యం వైపు సాగుతున్న క్రమంలో.. కమలాపుర వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మినీ లారీని బస్సు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు వేగంగా బస్సు అంతటికి వ్యాపించడంలో పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బస్సులో ఉన్న పలువురిని రక్షించారు. బస్సు అద్దాల పగలకొట్టి వారిని కాపాడారు. అయితే ఈ లోపే మంటలు విస్తరించడం వల్ల బస్సులోని.. ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వైద్యం కోసం క్షతగాత్రులను కలబురిగి జిల్లా ఆసుపత్రితో పాటు యునైటెడ్, గంగా ఆసుపత్రులకు తరలించారు. మంటల్లో తీవ్రగాయాలపాలైన మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిని లారీ డ్రైవర్‌కు సైతం తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందినదిగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో బీవన్‌, దీక్షిత్‌ అనే ఇద్దరితో పాటు రవళి, సరళాదేవి, అర్జున్‌ శివకుమార్‌, అనితారాజు, శివకుమార్​ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బిచ్చగాళ్లపై వేడినీళ్లు పోసిన 'ఎమ్మెల్యే బంధువు'- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.