ETV Bharat / bharat

బస్సులో భారీగా మంటలు.. నలుగురు యాత్రికులు మృతి

author img

By

Published : May 13, 2022, 8:29 PM IST

J&K: A bus caught fire in Katra
J&K: A bus caught fire in Katra

Jammu kashmir bus fire: జమ్ము కశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సుకు మంటలు అంటుకొని నలుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి.

బస్సులో మంటలు

kashmir bus fire accident: జమ్ముకశ్మీర్ రేసీ జిల్లా కట్రా ప్రాంతంలో బస్సుకు మంటలు అంటుకొని నలుగురు యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. కట్రా నుంచి జమ్ము వెళుతుండగా నొమాయ్‌ వద్ద బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

Jammu kashmir bus fire
మంటల్లో కాలిపోతున్న బస్సు
Jammu kashmir bus fire
కాలిపోయిన బస్సు

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు కట్రా వద్ద బేస్‌ క్యాంపు ఉంటుంది. బాధితులంతా వైష్ణో దేవిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎండ వేడి కారణంగా బస్సు ఆయిల్‌ ట్యాంకర్‌ వద్ద పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, బాంబు పేలుడు జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు.

Jammu kashmir bus fire
బస్సును పరిశీలిస్తున్న అధికారులు
Jammu kashmir bus fire
.
Jammu kashmir bus fire
ఆస్పత్రిలో క్షతగాత్రులు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.