ETV Bharat / bharat

భారత్​ x చైనా: ఈసారైనా చర్చలు ఫలించేనా?

author img

By

Published : Nov 6, 2020, 5:35 AM IST

Indian Army to press for expeditious disengagement at 8th round of military talks at Chushul
8వ విడత కమాండర్​ స్థాయి చర్చలు నేడే

భారత్​, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా ఇరు దేశాల మధ్య 8వ రౌండ్​ కమాండర్​ స్థాయి చర్చలు నేడు జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్​లోని చుషూల్​లో ఇరుదేశాల అధికారులు సమావేశం కానున్నారు. బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించటంపైనే కీలకంగా చర్చలు సాగనున్నాయి.

భారత్​-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకటమే లక్ష్యంగా ఎనిమిదో దఫా కార్ఫ్స్​ కమాండర్​​ స్థాయి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. నేడు తూర్పు లద్ధాఖ్​లోని చుషూల్​ ప్రాంతంలో ఉదయం 9.30 నిమిషాలకు ఇరు దేశాల అధికారులు భేటీ కానున్నారు. కీలక ప్రాంతాంల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న డ్రాగన్​ సైన్యాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకు రావాలని భారత్​ భావిస్తోంది.

ఇప్పటికే మన ఆర్మీ అధికారులు 50వేలకు పైగా బలగాలను వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచారు. అదే స్థాయిలో చైనా తమ సైన్యాన్ని సరిహద్దు వెంబడి ఉంచింది. ఇప్పటి వరకు జరిగిన కమాండర్​ స్థాయి చర్చల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

ఇదీ చూడండి:బలగాల ఉపసంహరణే తక్షణ కర్తవ్యం: కేంద్రం

శీతాకాలంలో తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీలకు పడిపోతాయి. ఈ క్రమంలో జరగనున్న ఎనిమిదో విడత చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత్‌- చైనా సంబంధాలపై సరిహద్దు సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంది. సరిహద్దులకు సంబంధించి జరిగిన ఒప్పందాలపై చైనా గౌరవం చూపాలని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే విషయంపై చర్చించడానికి ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రులు సెప్టెంబర్​లో భేటీ అయ్యారు.

ఇదీ చూడండి:ఆరోసారి భారత్-చైనా సైనిక కమాండర్లు భేటీ

ఏప్రిల్​-మే సమయంలో తూర్పు లద్దాఖ్​లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవటం, ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు నెలల తర్వాత పాంగోంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని కీలక పర్వతాలను భారత్​ కైవసం చేసుకుంది. భారత బలగాలు వాస్తవాధీన రేఖకు తమవైపే ఉన్నప్పటికీ.. చైనా వ్యతిరేకిస్తోంది.

ఈ క్రమంలో ఇరు దేశల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. అక్టోబర్​ 12న చివరిసారిగా, ఏడో విడత కార్ఫ్స్​ కమాండర్​ స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో బలగాల ఉపసంహరణ, యథాతథ స్థితిని పునరుద్ధరించటం సహా కీలక అంశాలపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: సుదీర్ఘ చర్చలు ఫలించేనా? ఉపసంహరణ జరిగేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.