ETV Bharat / bharat

Galwan: అమర వీరులకు సైన్యం నివాళి

author img

By

Published : Jun 15, 2021, 12:43 PM IST

Updated : Jun 15, 2021, 1:04 PM IST

తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య పెను ఘర్షణ జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా గల్వాన్​లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించింది భారత సైన్యం.

galwan, indian army
భారత సైన్యం, గల్వాన్ వీరులు

గల్వాన్ ఘటన జరిగి నేటితో ఏడాది పూర్తైన వేళ.. అమరవీరులకు భారత సైన్యం నివాళి అర్పించింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఘర్షణలో మన సైనికులు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడారు. ఈ ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు సహా.. 20 మంది సైనికులు అమరవీరులయ్యారు.

indian army
గల్వాన్​ ఘటన జరిగి నేటితో ఏడాది పూర్తి
indian army
గల్వాన్​ వీరులకు నివాళులు

ఘటన జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా... లేహ్​లో ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పాలతో గల్వాన్ వీరులకు మేజర్ జనరల్ ఆకాశ్ కౌశిక్, ఆర్మీ ఛీఫ్ ఎమ్ ఎమ్ నరవాణే, భద్రతా దళాలు నివాళి అర్పించాయి. దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సైనికులకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోందని సైన్యం పేర్కొంది.

indian army
నివాళులర్పిస్తున్న భారత సైన్యం
memorial
సైనిక స్మారక స్థూపం

ఇదీ చదవండి:

Last Updated : Jun 15, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.