ETV Bharat / bharat

దేశంలో 287 రోజుల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు

author img

By

Published : Nov 16, 2021, 9:36 AM IST

Corona cases in India
దేశంలో కరోనా కేసులు

దేశం​లో కొత్తగా 8,865 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ కారణంగా మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత్​లో కరోనా(Coronavirus India) వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 8,865 మంది వైరస్ బారిన పడినట్లు (Corona cases in India) తేలింది. ఇది 287 రోజుల కనిష్ఠం కావడం గమనార్హం. కరోనా(Coronavirus India)​ ధాటికి మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 11,971 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 34,456,401
  • మొత్తం మరణాలు: 4,63,852
  • యాక్టివ్​ కేసులు: 1,30,793
  • కోలుకున్నవారు: 3,38,61,756

పరీక్షలు

దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 11,07,617 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 62,57,74,159కి చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ(coronavirus worldwide) కొనసాగుతూనే ఉంది. కొత్తగా 406,235 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి మరో 5,315 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 254,536,544కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 5,121,468కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

దేశంకొత్త కేసులు
అమెరికా70,823
బ్రిటన్​39,705
రష్యా38,420
ఫ్రాన్స్​3,241
జర్మనీ30,483
ఇటలీ5,144

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.