ETV Bharat / bharat

Corona Cases: దేశంలో కొత్తగా 40 వేల మందికి కరోనా

author img

By

Published : Aug 2, 2021, 9:34 AM IST

దేశంలో కొత్తగా 40,134 కరోనా కేసులు(Covid in India) నమోదయ్యాయి. మరో 422 మంది మృతి చెందారు.

Covid cases in India
దేశవ్యాప్తంగా కరోనా కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి(Covid in India) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 40,134 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 36,946 మంది వైరస్​ నుంచి కోలుకోగా రికవరీ రేటు 97.35శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు: 3,16,95,958
  • మొత్తం మరణాలు: 4,24,773
  • కోలుకున్నవారు: 3,08,57,467
  • యాక్టివ్​ కేసులు: 4,13,718

వ్యాక్సినేషన్:

దేశంలో ఇప్పటివరకు 47,22,23,639 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 17,06,598 డోసులు అందించినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పరీక్షలు

ఆదివారం 14,28,984 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 46,96,45,494కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.