ETV Bharat / bharat

Corona Cases: దేశంలో కొత్తగా 30వేలకుపైగా కరోనా కేసులు

author img

By

Published : Aug 3, 2021, 9:55 AM IST

దేశంలో కొత్తగా 30,549 కరోనా కేసులు(Covid in India) నమోదయ్యాయి. మరో 422 మంది మృతి చెందారు.

corona cases
కరోనా కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి(Covid in India) క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొత్తగా 30,549 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38,887 మంది వైరస్​ నుంచి కోలుకోగా రికవరీ రేటు 97.38 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు: 3,17,26,507
  • మొత్తం మరణాలు: 4,25,195
  • కోలుకున్నవారు: 3,08,96,354
  • యాక్టివ్​ కేసులు: 4,04,958

వ్యాక్సినేషన్:

దేశంలో ఇప్పటివరకు 47,85,44,114 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 61,09,587 డోసులు అందించినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇలా ఉన్నాయి..

  • కేరళలో కొత్తగా 13,984 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్​తో మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో ఒక్కరోజే 4,869 కరోనా కేసులు నమోదయ్యాయి.90 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో కొత్తగా 1,957 మందికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 25 మంది చనిపోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,032 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 97 మంది మరణించారు.

ఇదీ చూడండి: కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి - కొత్తగా 13,984 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.