ETV Bharat / bharat

దేశంలో వరుసగా నాలుగోరోజు 3 లక్షలకుపైగా కేసులు

author img

By

Published : Apr 25, 2021, 9:56 AM IST

Updated : Apr 25, 2021, 11:01 AM IST

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. తాజాగా 3.49 లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మరో 2,767మంది ప్రాణాలు కోల్పోయారు.

covid-19 cases
కొవిడ్, కరోనా కేసులు

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజే 3,49,786 మందికి పాజిటివ్​గా తేలింది. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్తగా 2,767 మంది వైరస్​కు బలయ్యారు. 2,17,113 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. వరుసగా నాలుగో రోజూ భారత్​లో 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. పలు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

  • మొత్తం కేసులు: 1,69,60,172
  • మొత్తం మరణాలు: 1,92,311
  • మొత్తం కోలుకున్నవారు: 1,40,85,110
  • యాక్టివ్ కేసులు: 26,82,751
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొవిడ్​ నియంత్రణలో భాగంగా.. మొత్తంగా 14 కోట్ల 9 లక్షల 16 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:దొంగలు బాబోయ్‌.. దొంగలు!

Last Updated : Apr 25, 2021, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.