ETV Bharat / bharat

కరోనా పంజా: దేశంలో మరో 93,249 కేసులు

author img

By

Published : Apr 4, 2021, 9:50 AM IST

Updated : Apr 4, 2021, 10:26 AM IST

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఒక్కరోజే 93,249‬ మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్ సోకినవారిలో మరో 513 మంది ప్రాణాలు కోల్పోయారు.

INDIA REGISTERED 93,249 NEW COVID-19 POSITIVE CASES AND 513  DEATHS IN LAST 24 HOURS
దేశంలో మరో 93,249 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 93,249 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. మరో 513 మంది మహమ్మారికి బలయ్యారు.

  • మొత్తం కేసులు: 12,485,509‬
  • మొత్తం మరణాలు: 1,64,623
  • కోలుకున్న వారు: 1,16,29,289
  • యాక్టివ్​ కేసులు: 6,91,597

ఇదీ చదవండి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ- 50వేల కొత్త కేసులు

వైరస్​ సోకిన వారిలో 60,048 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 93.14 శాతంగా, మరణాల రేటు 1.32 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తాజాగా.. 27.38 లక్షల మందికి వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 7.59 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: 'టీకాల కోసం కొత్తగా ఆరోగ్య సిబ్బంది నమోదు వద్దు'

Last Updated : Apr 4, 2021, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.