ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా మరో 22,854మందికి కరోనా​

author img

By

Published : Mar 11, 2021, 9:40 AM IST

దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్తగా 22,854 వైరస్​ కేసులు నమోదయ్యాయి. మరో 126 మంది మరణించారు. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 18వేల మందికిపైగా కోలుకున్నారు.

INDIA REGISTERED 22,854 NEW COVID-19 POSITIVE CASES AND 126 DEATHS IN LAST 24 HOURS
దేశవ్యాప్తంగా మరో 22,854 మందికి వైరస్​

దేశంపై కరోనా వైరస్​ మరోసారి పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే 22,854 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య 1కోటీ 12లక్షల 85వేలు దాటింది. మరో 126మంది మహమ్మారికి బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,12,85,561
  • మొత్తం మరణాలు: 1,58,189
  • యాక్టివ్ కేసులు: 1,89,226
  • కోలుకున్నవారు: 1,09,38,146

తాజాగా సుమారు 18వేల 100 మంది వైరస్​ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 96.92 శాతంగా నమోదవ్వగా.. మరణాల రేటు 1.40శాతంగా ఉందని వివరించింది.

ఇదీ చదవండి: కరోనా కట్టడికి 'మహా'లో 7-పాయింట్ల కార్యచరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.