ETV Bharat / bharat

దేశంలో మరో 12,059 కరోనా కేసులు

author img

By

Published : Feb 7, 2021, 10:32 AM IST

దేశంలో కొత్తగా 12,059 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య కోటీ 8లక్షల 26 వేలు దాటింది. వైరస్​ సోకిన వారిలో మరో 11,805 మంది కోలుకున్నారు.

INDIA REGISTERED 12,059 NEW COVID-19 POSTIVE CASES AND 78 DEATHS IN LAST 24 HOURS
దేశంలో మరో 12,059 కేసులు.. 78 మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 12,059 మంది మహమ్మారి బారినపడ్డారు. వైరస్​ సోకిన వారిలో మరో 78 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 10,826,363
  • యాక్టివ్ కేసులు: 1,48,766
  • కోలుకున్నవారు: 1,05,22,601
  • మొత్తం మరణాలు: 1,54,996

కొవిడ్​ బారినపడిన వారిలో మరో 11,805 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.19 శాతంగా నమోదవ్వగా.. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతంగా ఉంది.

దేశీయంగా మరో 3లక్షల 57వేల మందికి వ్యాక్సినేషన్​ పూర్తైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 57.75 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: మరో 7 కొవిడ్​ టీకాలు సిద్ధమవుతున్నాయి: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.