ETV Bharat / bharat

చైనాకు వారి ప్రయాణం ఎప్పుడు?

author img

By

Published : Jun 11, 2021, 8:53 AM IST

చైనాకు తిరిగి వెళ్లాలనుకుంటున్న తమ ప్రయాణికుల్ని అనుమతించాలని ఆ దేశాన్ని కోరింది భారత్​. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు.

India, pakisthan
భారత్, పాకిస్థాన్

విద్య, ఉపాధి కోసం చైనాకు తిరిగి వెళ్లాలనుకుంటున్న తమ ప్రయాణికుల్ని అనుమతించాలని భారత్.. ఆ దేశాన్ని కోరింది. చైనా నుంచి వచ్చేవారి విషయంలో భారత్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదని గుర్తుచేసింది. కొవిడ్ నిబంధనల పేరుతో గత నవంబరు నుంచి భారత ప్రయాణికులకు చైనా వీసాలు నిరాకరిస్తోంది.

చైనా తయారీ చేసిన వ్యాక్సిన్లు వేయించుకొంటేనే అనుమతిస్తామంటూ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. దీంతో చైనా వెళ్లాలనుకుంటున్న వారంతా ఆ వ్యాక్సిన్లే వేయించుకొంటున్నారు. అయినా వారికి వీసాలు ఇవ్వడం లేదు. త్వరలోనే సమస్య పరిష్కారం కాగలదని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు.

ఇదీ చదవండి:'తూర్పు లద్దాఖ్‌లో.. ఉద్రిక్త ప్రాంతాలన్నీ వీడాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.