దేవభూమిపై వరుణుడి పంజా- 16 మంది బలి

author img

By

Published : Oct 19, 2021, 2:41 PM IST

d

ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వానల ధాటికి ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్​ చిగురుటాకులా వణుకుతోంది. రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా.. వరద ఉద్ధృతికి వంతెనలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

్
వరద ఉద్ధృతి
d
ఉధమ్​ సింగ్​ నగర్​ జిల్లాలోని రుద్రపుర్​లో నీటమునిగిన ఇళ్లు.

భారీ వర్షాలకు మంగళవారం ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరింది. వరద బాధితులకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.

్
వరద ధాటికి కొట్టుకుపోయిన బ్రిడ్జి

నైనితాల్​ జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. నైనితాల్​ సరస్సులో నీరు ప్రమాదకరస్థాయికి చేరుకుంది. సరస్సు పొంగిపొర్లడం వల్ల ఆ ప్రాంతంలోని రోడ్లు జలమయం అయ్యాయి. మరోవైపు హల్​ద్వానీలోని గౌలా నది ఉద్ధృతికి అక్కడి వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. వరద ఉద్ధృతి తగ్గాకే వంతెన మరమ్మతు పనులు చేపడతామని స్పష్టం చేశారు.

్
ప్రమాదకర స్థాయికి చేరిన గంగానది ప్రవాహం
్
వరదలో చిక్కుకున్న కారు

చమోలీ, బద్రీనాథ్​ల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి రోడ్లు అస్తవ్యస్తం అయ్యాయి. బద్రినాథ్​లోని ఓ ఘాట్​ రోడ్డులో కారులో ప్రయాణిస్తున్న పలువురు వరదల్లో చిక్కుకున్నారు. అప్రమత్తమైన అధికారులు యంత్రాల సాయంతో కారును ఒడ్డుకు లాగారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

మరోవైపు రిషికేశ్​లో గంగానది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

నిలిచిపోయిన రాకపోకలు

వరద ధాటికి కొట్టుకుపోయిన రైలు పట్టాలు

వర్షాల ధాటికి రాష్ట్రంలో రాకపోకలు నిలిచిపోయాయి. కాఠగోదామ్​ రైల్వే స్టేషన్​ పరిధిలో వరదల ధాటికి 500 మీటర్ల రైల్వేట్రాక్​ కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద తగ్గితే కానీ మరమ్మతులు చేపట్టలేమని రైల్వే సిబ్బంది స్పష్టం చేశారు.

మరోవైపు నైనితాల్​ జిల్లాలోని లాల్​కువాన్​ రైల్వే స్టేషన్​ పరిధిలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. పట్టాలపై వరద నీరు చేరడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి : కేరళ వరద విలయం.. 38కి చేరిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.