ETV Bharat / bharat

హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 7:38 AM IST

Updated : Dec 22, 2023, 12:54 PM IST

Hanamkonda Road Accident Today
Hanamkonda Road Accident Today

Hanamkonda Road Accident Today : హనుమకొండలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ప్రాణాలను బలిగొంది. ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట వద్ద కారు లారీ ఢీ కొనడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఘటనపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

Hanamkonda Road Accident Today : నిత్య జీవితంలో ఎప్పుడూ ఏ ప్రమాదం ముంచుకువస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. మనం మంచిగానే వాహనం నడుపుతున్నా, ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా, కొన్ని సార్లు ఇతరులు చేసినా తప్పులకు ఎందరో అమాయకులు బలవుతున్నారు.

Adilabad Lorry Accident Viral Video : కంటైనర్​ బీభత్సం.. లారీ.. బైక్​.. ఆటో.. ఆగేదే లే అన్నట్లుగా..

తాజాగా హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Hanamkonda Road Accident)చోటుచేసుకుంది. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఈరోజు తెల్లవారుజామున కారును, లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

"మా పెద్దమ్మ వాళ్లు దేవుని దర్శనం కోసం వేములవాడ వెళ్తున్నారు. ఇంతలోనే ఇలా జరిగింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. మా పెద్దమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తమ్ముడు, చెల్లె పరిస్థితి బాగానే ఉంది." - మృతుల బంధువులు

Road accident in Elkathurthi Today : కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు, పోలీసులు, స్ధానికులు తీవ్రంగా శ్రమించారు. గాయపడ్డ మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం, వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మలుగు జిల్లా ఏటూరునాగారం వాసులని పోలీసులు తెలిపారు. వరుసకు అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన ఏడుగురు, ఏటూరునాగారం నుంచి వేములవాడకు దైవదర్శనానికి కారులో వెళ్తుండంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.

నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. మృతులను కాంతయ్య, శంకర్‌, చందన, భరత్‌గా గుర్తించామని వివరించారు. క్షత్రగాత్రులు మంతెన రేణుక, శ్రీదేవి, భార్గవ్‌లని చెప్పారు. దట్టమైన పొగ మంచు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Khammam Accident Today : 'నేను రమ్మనకపోయినా బతికేటోళ్లు కొడుకా.. ఎంత పనైపాయే..'

Penchikalpet Road Accident Today : మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో మార్చురీ పరిసరాలు శోకసంద్రంగా మారాయి. మరోవైపు రోడ్డు ప్రమాద ఘటనపై పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితుల సొంతూరు ఏటూరునాగారంలో విషాదఛాయలు అమలుకున్నాయి. దగ్గరి సంబంధీకులంతా ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంపై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Bus Accident In Muktsar : కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి.. అనేక మందికి గాయాలు

RTC Bus Accident in Yadadri District : ఆటోను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రమాదంలో ఇద్దరు మృతి

Last Updated :Dec 22, 2023, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.