ETV Bharat / bharat

గుజరాత్​లో డ్రగ్స్ కలకలం.. పాక్ పడవలో రూ.400 కోట్ల హెరాయిన్

author img

By

Published : Dec 20, 2021, 8:28 AM IST

Updated : Dec 20, 2021, 11:54 AM IST

Gujarat drugs seized: గుజరాత్ తీరంలో భారీగా మాదకద్రవ్యాలను అధికారులు గుర్తించారు. పాకిస్థాన్​కు చెందిన ఓ పడవలో తరలిస్తున్న రూ.400 కోట్ల విలువైన డ్రగ్స్​ను సీజ్ చేశారు.

gujarat drugs seized
gujarat drugs seized

Gujarat drugs seized: గుజరాత్​లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సముద్ర తీరంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. మొత్తం రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Drugs in Pak boat

డ్రగ్స్​ సమాచారంతో భారత తీర రక్షణదళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. పాకిస్థాన్​కు చెందిన పడవలో హెరాయిన్​ను తరలిస్తున్నట్లు గుర్తించాయి. భారత జలాల్లోకి పడవ ప్రవేశించగానే వెంబడించి నిలిపివేశాయి. అందులోని 77 కిలోల హెరాయిన్​ను సీజ్ చేశారు. పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కచ్ జిల్లాలోని జఖావు తీరానికి పాకిస్థాన్ పడవను తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

వరుసగా ఎన్నో ఘటనలు..

ఇటీవలి కాలంలో గుజరాత్​లో వరుసగా మాదకద్రవ్యాలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్​లో కోస్ట్​గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​లో.. 30 కేజీల హెరాయిన్​ను సీజ్ చేశారు. పాకిస్థాన్ జాతీయులు రవాణా చేస్తున్న ఈ డ్రగ్స్ విలువ రూ.150 కోట్లుగా లెక్కతేలింది. నవంబర్​లో మోర్బి జిల్లాలో రూ. 600 కోట్ల డ్రగ్స్ బయటపడ్డాయి. వీటిని సైతం పాకిస్థాన్ డ్రగ్ డీలర్లే పంపినట్లు అధికారులు గుర్తించారు.

మరోవైపు, సెప్టెంబర్​లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుపడ్డాయి. రూ.21 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు అదానీకి చెందిన నౌకాశ్రయంలో సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మాదకద్రవ్యాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి: శక్తివంతమైన వ్యాక్సిన్‌ దిశగా శాస్త్రవేత్తల ముందడుగు

Last Updated : Dec 20, 2021, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.