ETV Bharat / bharat

గ్యాస్​ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి

author img

By

Published : Dec 22, 2020, 6:40 PM IST

Gujarat: 2 killed, 1 injured as 2 houses collapse after blast
గ్యాస్​ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

గుజరాత్​లో జరిగిన గ్యాస్​ పేలుడులో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్నారు.

గుజరాత్​లోని గాంధీనగర్​ జిల్లాలో జరిగిన గ్యాస్​ పేలుడులో ఇద్దరు మృతి చెందారని, మరో వ్యక్తి గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కలోల్​ పట్టణం పంచవటి ప్రాంతంలోని పోష్​ సోసైటీలో ఓ ఇంట్లో గ్యాస్ లీకై పేలుడు సంభవించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుడు ధాటికి అక్కడున్న రెండిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు.

పేలుడు సంభవించిన ప్రాంతం నుంచి ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్​జీసీ, గుజరాత్​ గ్యాస్ లిమిటెడ్​కు సంబంధించిన పైపులు వెళుతున్నాయని గాంధీ నగర్ ఎస్పీ తెలిపారు. పేలుడు జరగడం దురదృష్టకరమని ఓఎన్​జీసీ పేర్కొంది. ఈ ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని తెలిపింది.

ఇదీ చూడండి: పిండివంటలు చేస్తుండగా గ్యాస్‌ లీక్.. నలుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.