ఆర్మీ క్యాంప్​ ఎదుట గ్రనేడ్ పేలుడు.. నగరమంతా హై అలర్ట్​

author img

By

Published : Nov 22, 2021, 8:44 AM IST

armys gate

పఠాన్​కోట్​లోని(Pathankot News) ఆర్మీ క్యాంప్​ఎదుట గ్రనేడ్ పేలుడు సంభవించింది. ​సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. పఠాన్​కోట్​లోని అన్ని చెక్​పోస్ట్​లను అప్రమత్తం చేశారు.

పంజాబ్​ పఠాన్‌కోట్​లోని(Pathankot News) ధీరాపుల్​ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్​ ఎదుట గ్రనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఆర్మీ ఆఫీస్​ వద్ద ఉన్న త్రివేణి గేట్(Pathankot News) పక్కన సోమవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.

గుర్తుతెలియని దుండగులు.. ద్విచక్రవాహనంపై వచ్చి గ్రనేడ్​ను(Pathankot news army) విసిరి పారిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అదే సమయంలో అక్కడ ఓ వివాహం జరుగుతోందని పేర్కొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రనేడ్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన.. గ్రనేడ్ పదార్థాలను సేకరించినట్లు తెలిపారు.

సీసీటీవీ ఫూటేజ్​ను పరిశీలించిన పోలీసులు.. పఠాన్​కోట్​లోని(Pathankot news army) అన్ని పోలీస్​ చెక్​పోస్ట్​లను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 15వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.