మహారాష్ట్రలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పుణె జిల్లా వాణే గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. గతవారం ఎన్నికల సందర్భంగా ఓ 113 ఏళ్ల బామ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అదే రోజు కన్నుమూశారు. ఎన్నికల్లో పోటీ చేసిన తన మనవడికే చివరి ఓటు వేసి ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆమె మనవడు కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందాడు. ఆ బామ్మ వేసిన ఓటే మనవడి విజయానికి కారణమైంది.
ఓ వైపు ఎన్నికల్లో గెలిచిన ఆనందం, మరోవైపు బామ్మ మరణించారనే బాధను ఆ కుటుంభ సభ్యులు ఒకేసారి అనుభవిస్తున్నారు.