ETV Bharat / bharat

శీతాకాల సమావేశాల తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లు

author img

By

Published : Nov 27, 2021, 6:11 PM IST

సోమవారం నుంచి జరగనున్న శీతాకాల పార్లమెంట్​ సమావేశాల్లో.. తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును (Farm Bill Repeal) కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీనిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. లోక్‌సభ ముందుకు తీసుకెళ్లనున్నారు.

parliament
పార్లమెంట్​

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానుండగా.. తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 'కొంతమంది' రైతులు మాత్రమే నిరసనలు తెలుపుతున్నారని.. అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఇప్పటికే సోమవారం సభా కార్యకలాపాల జాబితాలో బిల్లును చేర్చిన కేంద్రం.. ఆ రోజే ఆమోదం తెలిపే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. లోక్‌సభలో సాగుచట్టాల రద్దు బిల్లు ప్రవేశ పెట్టనున్నారు.

ఈనెల 19న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ 3 సాగు చట్టాలను రద్దు (modi on farmers law) చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగా అధికారులు వేగంగా ఈ బిల్లు రూపొందించారు.

ఈనెల 24న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం మూడు వ్యవసాయ చట్టాల రద్దు (Farm Bill Repeal) బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు నేపథ్యంలో లోక్‌సభకు చెందిన ఎంపీలంతా సోమవారం హాజరుకావాలని భాజపా విప్‌ జారీ చేసింది.

ఈ నెల 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న రోజునే సాగు చట్టాలను ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించడం వల్ల ఆరోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా(Faremrs tractor rally suspended) వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్​కేఎం)(Samyukta kisan morcha) తెలిపింది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు టీఎంసీ ఝలక్​- విపక్షాల భేటీకి దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.