ETV Bharat / bharat

ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

author img

By

Published : Feb 3, 2021, 3:14 PM IST

Updated : Feb 3, 2021, 3:31 PM IST

Govt issues notice to Twitter to comply with its order to remove contents/accounts related to farmer genocide
ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

15:12 February 03

ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

రైతు ఉద్యమంలో పాల్గొన్న నాయకుల ఖాతాల విషయంలో ట్విట్టర్​ తీరుపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌ ఖాతాల నిలుపుదలపై ఆదేశాలు పాటించకపోవడంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.  

తొలుత రైతుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్​కు సూచించింది.  ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో పలు ఖాతాలను ట్విట్టర్‌ అధికారులు నిలిపివేశారు.  

అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే నిలిపివేసిన ఖాతాలను పునరుద్ధరించింది సామాజిక దిగ్గజం. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి.. నోటీసులు జారీ చేసింది.

Last Updated :Feb 3, 2021, 3:31 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.