ఫేక్ సర్టిఫికేట్​తో అడ్మిషన్- ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష

author img

By

Published : Oct 19, 2021, 3:09 PM IST

BJP MLA gets five years in jail for forgery

కళాశాలలో అడ్మిషన్ కోసం తప్పుడు ధ్రువపత్రం సమర్పించిన కేసులో ఓ ఎమ్మెల్యేకు ఐదేళ్ల శిక్ష పడింది. విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు ఆయనకు రూ.8 వేల జరిమానా సైతం విధించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఉత్తర్​ప్రదేశ్ అయోధ్యలోని గోసాయ్​గంజ్​ (Gosaiganj MLA) నియోజకవర్గ ఎమ్మెల్యే(భాజపా) ఇంద్ర ప్రతాప్ తివారీకి (Indra Pratap Tiwari MLA) ఐదేళ్ల జైలు శిక్ష పడింది. నకిలీ మార్కుల పత్రంతో కళాశాలలో అడ్మిషన్​ తీసుకున్నందుకు స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. ఆయనకు రూ.8 వేల జరిమానా సైతం విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకొని జైలుకు పంపించారు. (Indra Pratap Tiwari Khabbu Tiwari)

BJP MLA gets five years in jail for forgery
ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీ. అలియాస్ ఖబ్బూ తివారీ.

తివారీపై నమోదైన ఈ కేసు ఈ నాటిది కాదు. అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామ్ త్రిపాఠి.. 1992లో ఈయనపై కేసు పెట్టారు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఫెయిల్ అయినప్పటికీ.. తప్పుడు మార్క్​షీట్​తో తర్వాతి ఏడాదికి అడ్మిషన్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. రామ జన్మభూమి పోలీస్ స్టేషన్​లో ఈ కేసు నమోదు కాగా.. 13 ఏళ్ల తర్వాత ఛార్జ్​షీట్ పూర్తైంది. (BJP MLA in UP)

విచారణ సమయంలో.. ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ త్రిపాఠి సైతం మరణించారు. చాలా వరకు ఒరిజినల్ ధ్రువపత్రాలు కనిపించకుండా పోయాయి. పత్రాల జిరాక్సులు, సెకండరీ కాపీలతోనే న్యాయస్థానంలో విచారణ జరిగింది. సాకేత్ కళాశాల అప్పటి డీన్ మహేంద్ర కుమార్ అగర్వాల్​తో పాటు మరికొందరు... తివారీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.

ఇదీ చదవండి: ఆ ఎన్నికల్లో 40% టికెట్లు మహిళలకే: ప్రియాంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.