ETV Bharat / bharat

ఆ రాష్ట్ర ప్రభుత్వంపై జనరల్​ రావత్ బావమరిది ఆగ్రహం

author img

By

Published : Dec 15, 2021, 3:51 PM IST

Updated : Dec 15, 2021, 4:36 PM IST

General Bipin Rawat brother in law: భారత త్రివిధ దళాధిపతి, దివంగత జనరల్​ బిపిన్​ రావత్ బావమరిది.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందంటే?

General Bipin Rawat, జనరల్​ బిపిన్​ రావత్​
General Bipin Rawat, జనరల్​ బిపిన్​ రావత్​

General Bipin Rawat brother in law: అనుమతి లేకుండా మధ్యప్రదేశ్​ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ బావమరిది యశోవర్ధన్​ సింగ్​. జాతీయ రహదారి పనుల కోసం తన భూమిని వినియోగిస్తున్నట్లు ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు.

తన సోదరి మధులికా రావత్​, జనరల్ బిపిన్​ రావత్​ అంత్యక్రియల రోజు ఇది గుర్తించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం అందించలేదని, ముందస్తు సమాచారమూ ఇవ్వలేదని యశో​వర్ధన్​ తెలిపారు.

Gen. Bipin Rawat's brother-in-law  Yashvardhan Singh
జనరల్​ బిపిన్​ రావత్​ బావమరిది పోస్ట్​

''భూమి తీసుకున్నందుకు నాకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఎవరైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి.''

- యశో​వర్ధన్​ సింగ్​

మధులిక స్వస్థలమైన మధ్యప్రదేశ్​లోని రాజాబాఘ్ సోహగ్​పుర్​లోనే.. జాతీయ రహదారికి ఆనుకొని యశో​వర్ధన్​కు కొంత భూమి ఉంది. ప్రస్తుతం అక్కడే జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ విషయం జిల్లా కలెక్టర్​ వందనా వైద్య వరకు చేరింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తానని, తహశీల్దార్​ సహా ఇతర అధికారులను సంఘటనా స్థలానికి పంపుతామని ఆమె చెప్పారు. విచారణ అనంతరమే.. ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు.

ఇదే అంశంపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా కూడా ట్వీట్​ చేశారు. శహ్​డోల్​ ఎస్పీ నుంచి పూర్తి వివరాలు కోరిన ఆయన.. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

  • अगर पुलिस द्वारा किसी भी तरह का पूर्वाग्रह इस मामले में बरता गया है और किसी भी तरह की अवैधानिक कार्यवाही को प्रश्रय दिया है तो मैं खुद पूरे मामले को देखूगा और जो भी दोषी होगा उस पर कड़ी कार्रवाई होगी।

    — Dr Narottam Mishra (@drnarottammisra) December 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హెలికాప్టర్​ ప్రమాదంలో..

Chopper Crash: డిసెంబర్​ 8న జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదంలో జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులికతో పాటు మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది ఆరోజే చనిపోగా.. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయన 8 రోజులు మృత్యువుతో పోరాడి ఓడారు.

ఇవీ చూడండి: 'కొనప్రాణాలతో సీడీఎస్​ రావత్‌.. నీళ్లు కావాలని అడిగారు'

'రావత్​ నిజమైన నాయకుడు-మంచి స్నేహితుడు'

Last Updated : Dec 15, 2021, 4:36 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.