ETV Bharat / bharat

'రాహుల్​.. ఆ కిట్లను ఎందుకు పంచిపెట్టలేదు?'

author img

By

Published : Nov 25, 2020, 6:30 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్​ లోక్​సభ స్థానంలో కలకలం చెలరేగింది. కాంగ్రెస్​ నేతలు దాచి ఉంచిన వరద సహాయ కిట్ల విషయం వెలుగులోకి రాగా.. స్థానికులు, వామపక్ష కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

Flood relief kits from Rahul Gandhi found abandoned, trigger stir
కేరళలో కాంగ్రెస్​ వరద సహాయ కిట్ల కలకలం

రాహుల్​ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ వాయనాడ్​ లోక్​సభ స్థానంలో ఆందోళనలు చెలరేగాయి. వరద సహాయార్థం పంచిపెట్టాల్సిన కిట్లు లభ్యమవ్వడం.. ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎంపీ ల్యాడ్​ నిధులతో వచ్చిన ఈ కిట్లను తక్షణమే పంచి పెట్టాల్సి ఉండగా.. నీలంబుర్​ సమీపంలోని ఓ దుకాణంలో కాంగ్రెస్​ నేతలు దాచి పెట్టారని స్థానికులు, సీపీఎం నేతలు నిరసన చేపట్టారు.

ప్రజలకు కాంగ్రెస్​ నేతలు క్షమాపణ చెప్పాలని సీపీఎం అనుబంధ విభాగమైన డీవైఎఫ్​ఐ డిమాండ్​ చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కిట్ల అంశంపై దర్యాప్తు జరపాలని నీలంబుర్​ ఎమ్మెల్యే పీవీ అన్వర్​​ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం వెలుగులోకి రాగానే కిట్లను కాంగ్రెస్​ నేతలు తరలించారని అన్నారు.

"ఇది వదిలిపెట్టే అంశం కాదు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు ఆహార పదార్థాలు, దుస్తులు సహా ఇతర కిట్లను కాంగ్రెస్​ నాయకులు దాచిపెట్టారు. ఈ అంశంపై కలెక్టర్​ విచారణ జరపాలి. కేరళ పీసీసీ అధ్యక్షుడు ముల్లప్పల్లి రామచంద్రన్​ ఈ విషయంపై సమాధానం ఇవ్వాలి."

-- నీలంబుర్​ ఎమ్మెల్యే, పీవీ అన్వర్​

అయితే.. ఈ విషయం గురించి తమకు తెలియదని కాంగ్రెస్​ జిల్లా నేతలు వ్యాఖ్యానించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేరళ రాష్ట్ర కాంగ్రెస్​ నాయకత్వం ఈ అంశంపై ఇంకా స్పందించాల్సి ఉంది. కిట్లను దాచి ఉంచిన కిరాణాన్ని అద్దెకు తీసుకోవడానికి కొంతమంది ప్రయత్నించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదీ చూడండి:భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.