ETV Bharat / bharat

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో.. తండ్రీకుమారుడికి బెయిల్ మంజూరు

author img

By

Published : Jun 8, 2023, 12:37 PM IST

TSPSC Paper Leak Updates
TSPSC Paper Leak Updates

TSPSC Paper Leak Latest Updates : టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులకు బెయిల్​ లభించింది. ఏప్రిల్​ 21న అరెస్టైన మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్​లకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందికి బెయిల్​ దొరికినట్లైంది.

father son granted bail in TSPSC paper leak case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులకు బెయిల్​ లభించింది. మైబయ్య, జనార్దన్​లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు బెయిల్​ పొందిన వారి సంఖ్య 17కు చేరింది. ఇక మైబయ్య.. తమ కుమారుడు జనార్దన్​ కోసం ఢాక్యా నాయక్​ నుంచి రూ.2 లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారుల విచారణలో తేలడంతో ఏప్రిల్ 21న మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్​ను పోలీసులు అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే.

TSPSC Paper Leak News in Telugu : మరోవైపు.. ఈ కేసులో ప్రమేయమున్న 37 మంది నిందితులను డీబార్‌ చేయాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ 37 మంది నిందితులు ఇకపై కమిషన్ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్​పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నిందితులకు నోటీసులు జారీ చేసింది. లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేయనున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అయితే.. తమపై డీబార్​ను ఎత్తివేయాలంటూ ఇటీవల 16 మంది నిందితులు కమిషన్​ను ఆశ్రయించారు. వారి వివరణలు విన్న కమిషన్​.. సంతృప్తికరంగా లేకపోవడంతో డీబార్​ను ఎత్తివేయడానికి నిరాకరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి నియామక పరీక్షలు రాయకూడదని నిందితులకు స్పష్టం చేసింది.

  • TSPSC Paper Leakage Case : టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు.. 37 మందిపై అభియోగపత్రం?
  • SIT inquiries DE Ramesh in TSPSC Case : 'మాస్ కాపీయింగ్ సూత్రధారి డీఈ రమేశ్‌ లీలలెన్నో'

SIT Preliminary Charge Sheet TSPSC Leakage : ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే తమ దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్​ అధికారులు మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించి అభియోగ పత్రం దాఖలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం 37 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ అభియోగ పత్రం సిద్ధం చేస్తోంది. ముందుగా న్యాయనిపుణుల సలహా తీసుకొని.. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 50 మందిని అరెస్ట్ చేయగా.. అభియోగ పత్రంలో మాత్రం 37 మందిని నిందితులుగా చేర్చనున్నారు. ఆ 37 మందిలో ఒక్క ప్రశాంత్​రెడ్డి మినహా మిగతా నిందితులందరినీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రశాంత్​రెడ్డి ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉండటంతో సిట్ అధికారులు అతడికి లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు. 37 మందిలో 15 మంది నిందితులు ఇప్పటికే బెయిల్​పై బయటకు రాగా.. నేడు మరో ఇద్దరు నిందితులకు బెయిల్​ లభించింది.

ఇవీ చూడండి..

TSPSC Paper Leak Case Update : 'హైటెక్ మాస్​కాపీయింగ్​లో మాజీ ఎంపీటీసీ కుమార్తె'

SIT Investigate DE Ramesh in TSPSC case : ఒక్కో అభ్యర్థితో రూ.30లక్షలతో ఒప్పందం.. బయటపడుతున్న డీఈ రమేశ్ బాగోతం

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం డేట్​ ఫిక్స్​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.