ETV Bharat / bharat

నిద్రకు భంగం కలిగిస్తున్నాడని ఏడాదిన్నర కొడుకును చంపిన తండ్రి

author img

By

Published : Aug 13, 2022, 10:58 AM IST

Updated : Aug 13, 2022, 12:23 PM IST

Father killed his son నిద్ర పోతుండగా భంగం కలిస్తున్నాడని కోపంతో ఏడాదిన్నర చిన్నారిని చంపేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్​లో జరిగింది.

father murder his son in faridabad
father murder his son in faridabad

Father killed his son హరియాణా ఫరీదాబాద్​లో దారుణం జరిగింది. నిద్రకు భంగం కలిస్తున్నాడని కోపంతో ఏడాదిన్నర చిన్నారిని చంపేశాడు ఓ తండ్రి. తీవ్రంగా కొట్టడం వల్ల బాలుడు అక్కడిక్కడే మరణించాడు. తల్లి తన సోదరులకు రాఖీ కట్టేందుకు బయటకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. తల్లి వచ్చేసరికి కుమారుడు రక్తపు మడుగులో కనిపించాడు. నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

దంపతులు ఫరీదాబాద్​ బసెల్వా కాలనీలో నివసిస్తున్నారు. శుక్రవారం రక్షాబంధన్​ సందర్భంగా మహిళ.. తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లింది. మహిళకు ఇద్దరు కుమారులు కాగా.. ఓ కుమారుడిని తనతో తీసుకెళ్లింది. మరో కుమారుడిని తండ్రి వద్దే ఉంచి వెళ్లింది. నిందితుడు రాత్రి సమయంలో విధులు నిర్వర్తించి.. ఉదయాన్నే పడుకుంటాడు. ఈ క్రమంలోనే తండ్రి నిద్రపోతుండగా.. ఏడాదిన్నర చిన్నారి ఏడుస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి.. చిన్నారిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడిక్కడే మృతిచెందాడు. ఉదయం 9.30గంటల సమయంలో చిన్నారి ఏడుపులు వినిపించాయని.. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆగిపోయాయని స్థానికులు చెప్పారు. కానీ అతడి తండ్రే ఇలాంటి చర్యకు పాల్పడతాడని తాము ఊహించలేదన్నారు. చిన్నారి మృతి చెందడం వల్ల భయపడిన నిందితుడు.. అక్కడ నుంచి పరారయ్యాడు.

ఇవీ చదవండి: తెలుగు సినిమా చూసి బలవన్మరణం.. 20 లీటర్ల పెట్రోల్ పోసుకొని..

నీట్‌, జేఈఈ విలీనం.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే

Last Updated : Aug 13, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.