ETV Bharat / bharat

'రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే రైతు సంఘాన్ని వీడాల్సిందే'

author img

By

Published : Dec 9, 2021, 11:54 PM IST

Samyukta Kisan Morcha: రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే రైతు నేతలు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) వీడాలని ఆ సంఘం నేత దర్శన్ పాల్ స్పష్టం చేశారు. 40 రైతు సంఘాలతో ఏర్పాటైన ఎస్​కేఎం.. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన అనంతరం.. ఇతర డిమాండ్ల సాధనకు నిర్వహించిన ఆందోళనలకు నాయకత్వం వహించింది.

Darshan Pal
దర్శన్​పాల్

Samyukt Kisan Morcha Statement: రైతు సంఘాలన్నింటినీ కలిపి జాతీయ స్థాయి రైతు సంఘటిత శక్తిగా మార్చేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా సన్నద్ధమవుతుందని ఆ సంఘం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే కర్షక నాయకులు యూనియన్‌ను వీడాలని స్పష్టం చేశారు. రైతు సంఘం రాజకీయాలకు అతీతంగా ఉండాలని పునరుద్ఘాటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న ఆందోళనను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Farmers Protest News: మరోవైపు.. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందా? లేదా? అని సమీక్షించేందుకు వచ్చే ఏడాది జనవరి 15న సమావేశం కావాలని ఎస్​కేఎం నిర్ణయించింది.

"జనవరి 15 సమావేశంలో ఎస్‌కేఎంని జాతీయ స్థాయి మోర్చాగా ఏ విధంగా మార్చాలనే అంశంపై చర్చిస్తాం. రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే రైతు నాయకులు ఎస్‌కేఎంని నుంచి బయటకు వెళ్లాలి. ఈ సంఘం రాజకీయాలకు దూరంగా ఉంటుంది"

---దర్శన్​పాల్

Punjab Election 2022: పంజాబ్‌లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రైతులు రాజకీయ పార్టీగా మారొద్దని.. డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యవహరించాలని దర్శన్​పాల్ అభిప్రాయపడ్డారు.

Farmers Protest Withdrawn: 40 రైతు సంఘాలతో ఏర్పాటైన ఎస్​కేఎం.. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన అనంతరం.. ఇతర డిమాండ్ల సాధనకు నిర్వహించిన ఆందోళనలకు నాయకత్వం వహించింది.

"వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నవంబర్ 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనతో ఎస్​కేఎం 60 శాతం విజయం సాధించింది. ఇతర డిమాండ్లను నెరవేర్చిన గురువారం(డిసెంబర్ 9) మరో 35 శాతం సాధించాం. అయితే మిగతా డిమాండ్లన్నీ నెరవేరినప్పుడే మిగతా ఐదు శాతం విజయం లభించినట్లు."

--దర్శన్​పాల్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.