ETV Bharat / bharat

వైరల్​: బతికున్న పామును తింటే.. కరోనా రాదంట!

author img

By

Published : May 28, 2021, 10:09 AM IST

Updated : May 28, 2021, 11:10 AM IST

Farmer eats a snake
పామును తిన్న వ్యక్తి

తమిళనాడులో ఓ వ్యక్తి బతికున్న పామును తిని.. 'కరోనాకు ఇదే అరుదైన ఔషధం' అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

పామును తింటున్న రైతు వడివేలు

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సినే ప్రధాన ఆయుధమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. కొంత మంది వింత పద్ధతులను అనుసరిస్తున్నారు. తమిళనాడులో ఓ వ్యక్తి.. బతికున్న పామును తింటే వైరస్​ను ఓడించవచ్చు అని చెప్పాడు.

ఏం జరిగిందంటే..

తమిళనాడు మదురై జిల్లాలోని పెరుమల్​పట్టి గ్రామానికి చెందిన వడివేలు అనే ఓ రైతు గురువారం ఓ బతికున్న పామును తిన్నాడు. అంతేగాకుండా.. ఇది కరోనాకు దివ్యౌషధం అని చెప్పాడు.

Farmer eats a snake
పామును తింటున్న రైతు వడివేలు

పామును వడివేలు తింటుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్​లో వీడియో తీశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: కరెంటు తీగలు రాసుకొని మంటలు- పేలిన సిలిండర్​

ఇదీ చూడండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి

Last Updated :May 28, 2021, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.