ETV Bharat / bharat

'కాంగ్రెస్ విజయమే లక్ష్యం.. ప్రచారానికి సిద్ధం'

author img

By

Published : Mar 6, 2021, 5:31 AM IST

Updated : Mar 6, 2021, 7:11 AM IST

కాంగ్రెస్​ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమని ఆ పార్టీ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. పిలిస్తే ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమన్నారు. కాంగ్రెస్ విజయమే తమ లక్ష్యమన్నారు.

Ensuring victory of Cong in assembly polls priority: Ghulam Nabi Azad
'కాంగ్రెస్ విజయమే లక్ష్యం.. ప్రచారానికి సిద్దం'

ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారానికి ఎక్కడికి పిలిచినా వెళ్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తోన్న నాయకులు (జీ-23) తరపున ఆయన మాట్లాడారు. 'కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరపున ఐదు రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పార్టీలోని నా సహచరుల తరపున నేను ఈ విషయం స్పష్టం చేస్తున్నా. కాంగ్రెస్‌ పార్టీ గెలుపునే మేం కోరుకుంటున్నాం. రాబోయే రెండునెలల్లో ఇదే మా లక్ష్యం' అని ఆజాద్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తోన్న ఆజాద్‌ తాజాగా ఓ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసలతో ముంచెత్తారు. దీనిపై పలు విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. తాను ప్రధానిని ఒక సందర్భం కారణంగానే ప్రశంసించానని ఆయన వెల్లడించారు. అంతకుముందు పార్లమెంటులో గులాం నబీ ఆజాద్‌ వీడ్కోలు సందర్భంగా ఆయన గురించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చూడండి: 'ఆ లక్ష్యాలను గడువు కంటే ముందే సాధిస్తాం'

Last Updated :Mar 6, 2021, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.