ప్రాణం తీసిన ఈత సరదా.. తొమ్మిది మంది మృతి

author img

By

Published : May 19, 2022, 10:55 PM IST

Updated : May 20, 2022, 12:09 AM IST

school children drown in dam

ఈత సరదా యువతుల పాలిట శాపంగా మారింది. జలాశయం బ్యాక్​ వాటర్​లో ఈత కోసం వెళ్లి నీట మునిగారు ఐదుగురు మహిళలు. ఈ సంఘటన మహారాష్ట్ర, పుణె జిల్లాలో జరిగింది. పుణెలోనే జరిగిన మరో ఘటనలో ఈతకెళ్లి నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్ర, పుణె జిల్లాలో విషాద ఘటన జరిగింది. భాట్ఘర్​ జలాశయం బ్యాక్​ వాటర్​లో ఈతకు వెళ్లి ఐదుగురు మహిళలు నీట మునిగి చనిపోయారు. "ఐదుగురి మృతదేహాలను వెలికి తీశాం. వారి వయసు 19 నుంచి 23 మధ్యలో ఉంటుంది" అని పుణె రూరల్​ పోలీసులు తెలిపారు.

school children drown in dam
ప్రాణం తీసిన ఈత సరదా

భోర్​ తహసీల్​, నరేగావ్​ గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ఐదుగురు యువతులు హాజరయ్యారు. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. గురువారం సాయంత్రం డ్యామ్​లోని బ్యాక్​ వాటర్​లో ఈత కోసం వెళ్లారు. నీటి లోతు ఎక్కువగా ఉండటం వల్ల మునిగిపోయారు.

school children drown in dam
ప్రాణం తీసిన ఈత సరదా

నలుగురు పదో తరగతి విద్యార్థులు: పుణె జిల్లాలోనే జరిగిన మరో ఘటనలో నలుగురు విద్యార్థులు నీట మునిగారు. క్రిష్ణమూర్తి ఫౌండేషన్​ ఆధ్వర్యంలోని సహ్యాద్రి ఇంటర్నేషనల్​ స్కూల్​ విద్యార్థులు నలుగురు.. ఖేడ్​ తహసీల్​లోని చాస్కమాన్​ డ్యామ్​లో ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు.. రితీన్​ డీడీ, నవ్య భోస్లే, పరిక్షత్​ అగర్వాల్​, తనిష్క దేశాయ్​లుగా గుర్తించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి జలాశయం చూసేందుకు వెళ్లారని, నీటిలో ఈతకు వెళ్లగా కొందరు విద్యార్థులు నీట మునిగారని పోలీసులు తెలిపారు. అందులో పలువురిని ఉపాధ్యాయులు కాపాడగా.. నలుగురు మృతి చెందినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: అతిపెద్ద కుటుంబం.. ఒకటిన్నర ఎకరంలో ఇల్లు.. 62 మందికి ఒకే కిచెన్​!

Last Updated :May 20, 2022, 12:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.