ETV Bharat / bharat

కేంద్ర ఆరోగ్య శాఖతో ఈసీ భేటీ- ఎన్నికల నిర్వహణపై చర్చ!

author img

By

Published : Jan 6, 2022, 12:41 PM IST

EC meeting health ministry
కేంద్ర ఆరోగ్య శాఖతో ఈసీ భేటీ

EC meeting health ministry: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం(ఈసీ) భేటీ అయింది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

EC meeting health ministry: కేంద్ర ఆరోగ్య శాఖతో ఎన్నికల సంఘం(ఈసీ) సమావేశమైంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు ఎన్నికస సంఘం అధికారులు- ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలా? వాయిదా వేయాలా? అనే అంశంపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది.

EC meeting health ministry
ఈసీ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​
EC meeting health ministry
ఈసీ కార్యాయలయానికి కారులో చేరుకున్న రాజేశ్​ భూషణ్​
EC meeting health ministry
ఈసీ కార్యాలయం వద్ద కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​

Covid in poll-bound states: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​, గోవా, ఉత్తరాఖండ్​, పంజాబ్​, మణిపుర్ రాష్ట్రాల్లోని కొవిడ్ పరిస్థితులను ఈసీకి రాజేశ్ భూషణ్​ వివరించడం ఇది రెండోసారి. అంతకుముందు డిసెంబరు 27న జరిగిన భేటీలో కరోనా పరిస్థితులను ఈసీకి ఆయన వివరించారు. ఆ సమయంలో... ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.

మరికొన్ని రోజుల్లోనే ... ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'ఒమిక్రాన్​ వేళ ఎన్నికలెలా?'.. ఆరోగ్య శాఖతో ఈసీ విస్తృత చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.