ETV Bharat / bharat

చాక్లెట్ అనుకొని ఎలుకల మందు తిని.. పాపం చిన్నారి!

author img

By

Published : Apr 24, 2022, 3:47 PM IST

Eat rat poison Nagpur
ఎలుకల మందు తిని బాలిక మృతి

Eat rat poison Nagpur: మహారాష్ట్రలో విషాదకర ఘటన జరిగింది. చాక్లెట్ అనుకొని ఎలుకల మందు తిని నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

Eat rat poison Nagpur: చాక్లెట్​ అనుకొని ఎలుకల మందును తిని ఓ నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లోని జై గురుదేవ్ నగర్​లో జరిగింది. మూషికాలను నివారించేందుకు ఇంట్లో పెట్టిన ఎలుకల మందు తమ బిడ్డ ప్రాణం తీస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు.

అసలేం జరిగిదంటే: ఎలుకల బెడద ఎక్కువగా ఉండడం వల్ల వాటిని నివారించేందుకు మృతురాలు గుంజన్ నిలేశ్(4) ఇంట్లో ఎలుకల మందు పెట్టారు. బొమ్మతో ఆడుకుంటూ.. చాక్లెట్ ఆకారంలో ఉన్న ఆ మందును చిన్నారి తినేసింది. వెంటనే ఆమె అసౌకర్యంగా ఉండడం వల్ల తల్లి ప్రశ్నించింది. ఆ బాలిక చాక్లెట్​ తిన్నానని చెప్పింది. వాంతులు చేసుకోవడం వల్ల.. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుంజన్ మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి: ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు షాక్.. 14 రోజులు జైలులోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.