ETV Bharat / bharat

Earthquake: కశ్మీర్​లో భూకంపం- వణికిపోయిన పాక్​ ప్రజలు!

author img

By

Published : Jan 1, 2022, 10:11 PM IST

Earthquake tremors felt in Jammu and Kashmir
Earthquake tremors felt in Jammu and Kashmir

Earthquake: జమ్ముకశ్మీర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. పాకిస్థాన్​లోనూ 5.3 తీవ్రతతో భూమి కంపించింది.

Earthquake: జమ్ముకశ్మీర్​ ప్రజలు ఒక్కక్షణం ఉలిక్కిపడ్డారు. శనివారం సాయంత్రం కశ్మీర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. అఫ్గానిస్థాన్​- తజికిస్థాన్​ సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్ముకశ్మీర్​లోనూ ప్రకంపనలు వచ్చాయి.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

వణికిపోయిన పాకిస్థాన్​..

Earthquake Rocks Northern Pakistan: అఫ్గాన్​ సరిహద్దులో భూకంపంతో.. ఉత్తర పాకిస్థాన్​లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. ఖైబర్​ పఖ్తుంక్వా ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూమి కంపించింది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఇదీ చూడండి: 'కలిసికట్టుగా పనిచేస్తేనే.. కొవిడ్-19​కు ముగింపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.