ETV Bharat / bharat

90 కిలోల హెరాయిన్​ పట్టివేత​​​.. విలువ రూ.450 కోట్లకుపైనే!

author img

By

Published : Apr 29, 2022, 9:37 PM IST

drugs seized in gujarat port
డ్రగ్స్​

Drugs Seized in Gujarat Port: ఇరాన్​ నుంచి భారత్​కు తరలిస్తున్న 90 కిలోల హెరాయిన్​ను గుజరాత్​లోని పిపావాన్​ పోర్టులో పట్టుకున్నారు ఏటీఎస్​, డీఆర్​ఐ అధికారులు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.450 కోట్లకుపైనే ఉంటుందని తెలిపారు. సముద్రంలో పట్టుబడిన పాకిస్థాన్​ పడవలో 56 కిలోల డ్రగ్స్​ పట్టుకున్నట్లు గుజరాత్​ డీజీపీ తెలిపారు.

Drugs Seized in Gujarat Port: గుజరాత్​లో మరోమారు భారీ స్థాయిలో డ్రగ్స్​ బయటపడ్డాయి. గుజరాత్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​(ఏటీఎస్​), డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇటెలిజెన్స్​(డీఆర్​ఐ) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో.. పిపావావ్​ నౌకాశ్రయంలో 90 కిలోల హెరాయిన్​ పట్టుబడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.450 కోట్లకుపైనే ఉంటుందని రాష్ట్ర డీజీపీ ఆశిశ్​ భాటియా తెలిపారు. ఇరాన్​లోని అమ్రేలి జిల్లా నుంచి పిపావావ్​ పోర్టుకు వచ్చిన కంటెయినర్​లో మాదకద్రవ్యాలు దొరికినట్లు చెప్పారు. అధికారుల కళ్లుగప్పి మత్తుపదార్థాలను చేరవేసేందుకు డ్రగ్​ సిండికేట్.. హెరాయిన్​తో కూడిన ద్రావణంలో ధారాలను నానబెట్టే ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించినట్లు తెలిపారు డీజీపీ. ఆ తర్వాత వాటిని కాల్చి, వచ్చిన పొడిని ప్యాకింగ్​ చేసి ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు.

" ఐదు నెలల క్రితం పిపావావ్​ పోర్టుకు ఇరాన్​ నుంచి వచ్చిన కంటెయినర్​లో ధారాలతో కూడిన పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి. నాలుగు అనుమానిత బ్యాగులను పరిశీలించగా.. హెరాయిన్​తో కలిసిన ధారాలు సుమారు రూ.395 కిలోలు ఉన్నట్లు ఫోరెన్సిక్​ పరీక్షల్లో తేలింది. వాటి నుంచి హెరాయిన్​ను వేరు చేయగా 90 కిలోలు వచ్చింది. దాని విలువ రూ.450 కోట్లకుపైనే ఉంటుంది."

- ఆశిష్​ భాటియా, గుజరాత్​ డీజీపీ

అధికారుల తనిఖీలను తప్పించుకునేందుకు సాధారణ దారాలతో కూడిన బేల్స్​తో హెరాయిన్​తో కలిసిన దారాల బ్యాగులను తీసుకొచ్చారని డీఆర్​ఐ తెలిపింది. ఎన్​డీపీఎస్​ చట్టం, 1985 ప్రకారం దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

56 కిలోల హెరాయిన్​ సీజ్​: ఏటీఎస్​, భారత కోస్ట్​ గార్డ్​ నిర్వహించిన ఆపరేషన్​లో.. సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఆల్​ హాజ్​ అనే బోట్​ను, 9 మంది పాకిస్థానీలను అరెస్ట్​ చేసినట్లు డీజీపీ భాటియా తెలిపారు. వారి దగ్గర నుంచి 56 కిలోల హెరాయిన్​ సీజ్​ చేశామన్నారు. వారిని పోలీసు రిమాండ్​కు తరలించి, విచారిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: అఫ్గాన్​ నుంచి 100 కేజీల హెరాయిన్​.. ధర రూ.700 కోట్లకుపైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.