ETV Bharat / bharat

వైద్యులపై కరోనా పడగ.. 193 మందికి పాజిటివ్

author img

By

Published : Jan 3, 2022, 3:20 PM IST

Doctors infected with Covid: బంగాల్, బిహార్​లోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా కలకలం రేపింది. మొత్తం 193 మంది వైద్యులకు వైరస్ పాజిటివ్​గా తేలింది. కోల్​కతాలో మూడు వేర్వేరు ఆస్పత్రుల్లోని వైద్యులు వైరస్ బారిన పడ్డారు. మరోవైపు, పట్నాలో జరిగిన ఐఎంఏ వార్షిక సదస్సుకు హాజరైన వారిలో అనేక మందికి పాజిటివ్​గా తేలింది.

Doctors infected with Covid
వైద్యులకు కరోనా

Doctors infected with covid: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో వైద్యులు సైతం పెద్ద సంఖ్యలో కొవిడ్ బారిన పడుతున్నారు. కోల్​కతాలోని మూడు వేర్వేరు ఆస్పత్రుల్లో కలిపి 106 మంది వైద్యులకు కరోనా పాజిటివ్​గా తేలిందని సీనియర్ వైద్యాధికారులు వెల్లడించారు.

Kolkata Doctors covid:

కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీలో 70 మంది వైద్యులకు కొవిడ్ సోకిందని చెప్పారు. చిత్తరంజన్ సేవా సదన్​, శిశు సదన్ ఆస్పత్రిలో పని చేసే 24 మంది మెడికల్ ప్రాక్టీషనర్లు, రీజనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్తమాలజీకి చెందిన 12 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయిందని వివరించారు. 'కరోనా సోకిన వైద్యులందరినీ సంస్థాగత క్వారంటైన్​కు వెళ్లాలని సూచించాం. కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టాం. మూడు ఆస్పత్రుల్లో సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని అధికారులు స్పష్టం చేశారు.

Patna Doctors covid positive

మరోవైపు, బిహార్​ పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్​) 87 మంది వైద్యులు కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. ఎన్ఎంసీహెచ్​లో మొత్తం 194 నమూనాలకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 75 మందికి ఆదివారం వైరస్​ నిర్ధరణ అయింది. అయితే.. కొవిడ్​ సోకిన వారిలో ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగతా వారంతా హోం ఐసొలేషన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

"ఎన్ఎంసీహెచ్​లో 87 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వారంతా ఆస్పత్రి క్యాంపస్​లో ఐసొలేషన్​లో ఉన్నారు."

--పట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్

IMA anniversary Covid

ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే ఈ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. కరోనా నిర్ధరణ అయిన ఎన్ఎంసీహెచ్ వైద్యుల్లో చాలా మంది డిసెంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఐఎంఏ సదస్సుకు హాజరైన వారే కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శనివారం పట్నా ఎయిమ్స్​కు చెందిన ఇద్దరు వైద్యులకు సైతం కరోనా సోకినట్లు తేలింది.

అప్రమత్తంగా..

Bihar covid cases: ఎన్ఎంసీహెచ్​ వైద్యులు కరోనా బారినపడిన నేపథ్యంలో పట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్​ బాధితులతో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించే చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు బిహార్​లో అధికంగా ఉన్నారని ఐఎంఏ గతంలో తెలిపింది.

ఇదీ చదవండి: 'భారత్​లో థర్డ్ వేవ్​కు ముగింపు అప్పుడే.. ఎన్నికల ర్యాలీలే సూపర్ స్ప్రెడర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.