వృథాగా ఉన్న రైలు బోగీలో ఆఫీస్.. ఏం ఐడియా గురూ!

author img

By

Published : Feb 16, 2022, 7:17 PM IST

Updated : Feb 16, 2022, 9:54 PM IST

Dilapidated Rail Office In Chhattisgarh

Dilapidated Rail Office In Chhattisgarh: ఛత్తీస్​గఢ్​కు చెందిన రైల్వే అధికారులు వృథాగా పడి ఉన్న రైల్వే కోచ్​ను కార్యాలయంగా మలిచారు. బోగీలోని స్లీపర్​ సీట్లను తొలగించి.. వాటి స్థానంలో టేబుళ్లు, కుర్చీలు, కప్​​బోర్డులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ బోగీ నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు రైల్వే అధికారులు.

వృథాగా ఉన్న రైలు బోగీలో ఆఫీస్

Dilapidated Rail Office In Chhattisgarh: కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. చుట్టూ ఉన్నవేవీ వ్యర్థం కాదని నిరూపించారు ఛత్తీస్​గఢ్​కు చెందిన రైల్వే అధికారులు. బిలాస్​పుర్​ రైల్వే జంక్షన్​లో ఏళ్లనుంచి వినియోగించకుండా పడి ఉన్న రైల్వే కోచ్​ను ప్రభుత్వ కార్యాలయంగా మలిచారు. ఇప్పుడు ఈ బోగీలో నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు రైల్వే అధికారులు.

Dilapidated Rail Office In Chhattisgarh
ఆఫీస్ ఏర్పాటు చేసింది ఈ బోగీలోనే
Dilapidated Rail Office In Chhattisgarh
రైలు బోగీలోని ఆఫీస్​లో విధులు నిర్వర్తిస్తూ..

బోగీలోనే అన్ని వసతులు..

బోగీని ఇలా తయారు చేయడానికి కొచిన్​ నుంచి కొంతమంది ఇంజినీర్లను ప్రత్యేకంగా రప్పించింది రైల్వే బృందం. బోగీలోని స్లీపర్​ సీట్లను తొలగించారు. వాటి స్థానంలో టేబుళ్లు, కుర్చీలు, కప్​​బోర్డులను ఉంచారు.

Dilapidated Rail Office In Chhattisgarh
రైల్వే కోచ్​లోనే ఆఫీస్
Dilapidated Rail Office In Chhattisgarh
రైలు బోగీలోనే అన్ని వసతులు

రెండు కంపార్ట్​మెంట్​లలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్​లో ఆరుగురు కూర్చునే విధంగా సీటింగ్ రూపొందించారు. లైట్​, ఫ్యాన్​తోపాటు టాయిలెట్​, వాష్ బేసిన్​లను కూడా అమర్చారు.

"రైల్వే ఉద్యోగులకు కొత్త భవనాలు నిర్మించాల్సి ఉంది. అవి ఇంకా పూర్తికాలేదు. వృథాగా ఉన్న రైల్వే కోచ్​లో ఆఫీస్​ను ఏర్పాటు చేయాలని భావించాం. నూతన భవనం పూర్తయ్యాక కార్యాలయాన్ని అక్కడికి మారుస్తాం."

-- సాకేత్ రంజన్, ఆగ్నేయ రైల్వే సీపీఆర్​ఓ

అంతేకాక మహిళా ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు. గాలి, వెలుతురు కోసం బోగీ కిటికీలను అలాగే ఉంచారు. ఇప్పుడు ఈ బోగీ నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు రైల్వే ఉద్యోగులు.

ఇలా వృథాగా ఉన్న ఏసీ, స్లీపర్ బోగీలను ఉపయోగించుకోవడం ద్వారా.. కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించే ఖర్చు తగ్గుతుందని ఆగ్నేయ రైల్వే సీపీఆర్​ఓ సాకేత్ రంజన్ తెలిపారు.

ఇదీ చూడండి: కేంద్రం కొత్త రూల్స్​- బైక్​పై పిల్లలతో వెళ్తే ఇవి తప్పనిసరి!

Last Updated :Feb 16, 2022, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.